తెలంగాణలో యూనిఫామ్ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీస్, ఫైర్, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (SPF) విభాగాలలో కానిస్టేబుల్ తదితర సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో 3 ఏళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో ఎంఎస్ నంబర్ 129ను జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

గతంలో జీవో ఎంఎస్ నంబర్ 122 ద్వారా ప్రభుత్వం కానిస్టేబుల్ పోస్టులకు 7 ఏళ్ల వయోపరిమితి సడలింపునిచ్చింది. అయితే, పోలీసు శాఖలోని సబ్-ఇన్స్పెక్టర్ (SI) పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు కాగా, కానిస్టేబుల్ పోస్టులకు 29 ఏళ్లుగా ఉండటంతో రెండింటి మధ్య 3 ఏళ్ల వ్యత్యాసం ఏర్పడింది. ఈ తేడా వల్ల ఎంతోమంది అర్హులైన అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయాన్ని నిరుద్యోగులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పాత జీవో ప్రకారం ఇచ్చిన 7 ఏళ్లకు అదనంగా మరో 3 ఏళ్ల సడలింపు ఇస్తూ తాజా జీవో ఇచ్చింది. దీనివల్ల సాధారణ పరిమితి కంటే మొత్తం 10 ఏళ్ల వరకు అదనపు వయోపరిమితి లభించనుంది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ నూతన సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాలలోని కానిస్టేబుల్, ఆ సమాన స్థాయి క్యాడర్ పోస్టులకు వర్తిస్తుంది. పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు మాత్రం ఈ అదనపు సడలింపు వర్తించదు.
వయోపరిమితి వ్యత్యాసం కారణంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకుని, తక్షణమే స్పందించి ఉత్తర్వులు జారీ చేయడంపై నిరుద్యోగ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సుదీర్ఘకాలంగా ఖాళీల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఓవర్ ఏజ్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు మరో గొప్ప ఛాన్స్ లభించింది. వయసు పరిమితి పెంచడంతో ఈసారి పోటీ ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
{{/usCountry}}వయోపరిమితి వ్యత్యాసం కారణంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకుని, తక్షణమే స్పందించి ఉత్తర్వులు జారీ చేయడంపై నిరుద్యోగ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సుదీర్ఘకాలంగా ఖాళీల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఓవర్ ఏజ్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు మరో గొప్ప ఛాన్స్ లభించింది. వయసు పరిమితి పెంచడంతో ఈసారి పోటీ ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
{{/usCountry}}