తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు : ముగిసిన మొదటి విడత పోలింగ్ - ఓట్ల లెక్కింపు షురూ

రాష్ట్రంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. 189 మండలాల్లోని 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Published on: Dec 11, 2025 2:22 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా… మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. భోజన విరామం పూర్తి కావటంతో… మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు.

మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

మరోవైపు పోలింగ్ సమయం ముగిసినా కొన్నిచోట్ల ఓటర్లు బారులు తీరి ఉన్నారు. గేట్లు వేసి మధ్యాహ్నం ఒంటి గంటలోపు క్యూలైన్లో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం… మొదటి విడత కింద ఇవాళ 189 మండలాల్లోని 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా… మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. మొదట ఉప సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేస్తారు. గెలిచిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు.

మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు భారీ ఎత్తున తరలిరావటంతో… చౌటుప్పల్ దగ్గర హైవేపై భారీగా వాహనాలు కనిపించాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లోనూ రద్దీ కనిపించింది.

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పోలీసులు పట్టిష్టమైన చర్యలు చేపట్టారు. ఇక ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చూస్తున్నారు. రౌండ్ టు రౌండ్ ఓట్ల ఫలితాలను వెల్లడించనున్నారు.