సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రూ.20 లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

శనిగరం గ్రామానికి 46 ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా కింద రూ.1.57 కోట్లు, రైతు రుణమాఫీ కింద రూ.4.54 కోట్లు, గృహజ్యోతి కింద 997 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ప్రయోజనం అందించినట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గ్రామంలోని అత్యవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి, శనిగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్పామ్ సాగు, జలసిరి, స్టీల్ బ్యాంకులు, మహిళా సంఘాల బలోపేతం, విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహం వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లివాగు బ్రిడ్జి నిర్మాణానికి రూ.17 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరలో మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోల సమ్మెకు కార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమ్మె నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2015 తర్వాత ఆటో ఛార్జీలు పెంచలేదని, పెరిగిన ఖర్చులు పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు. ఇందులోపల ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా అధికారులను భాగస్వామ్యం చేస్తామన్నారు. అన్ని అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
'పాత ఆటోలను స్క్రాప్ చేసి ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం సహకరిస్తుంది. దశల వారీగా ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లోని ఆటో కార్మికుల సమస్యలు పరిగణనలోకి తీసుకుంటాం. డీజిల్, పెట్రోల్ ఆటోలను రెటిరోఫిట్మెంట్కు నూతన పథకం తెస్తాం.' అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
{{/usCountry}}'పాత ఆటోలను స్క్రాప్ చేసి ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం సహకరిస్తుంది. దశల వారీగా ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లోని ఆటో కార్మికుల సమస్యలు పరిగణనలోకి తీసుకుంటాం. డీజిల్, పెట్రోల్ ఆటోలను రెటిరోఫిట్మెంట్కు నూతన పథకం తెస్తాం.' అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
{{/usCountry}}తెలంగాణలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు తమ నిరసన గళాన్ని విప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆటోరిక్షా డ్రైవర్ల యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమ్మెకు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ కూడా తన పూర్తి మద్దతును తెలిపింది.
ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి ప్రకటించిన రూ. 12,000 ఆర్థిక సాయాన్ని, పాత బాకీలతో సహా వెంటనే ఖాతాల్లో జమ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రకటించిన రూ. 5 లక్షల ఉచిత ప్రమాద భీమా పథకాన్ని పునరుద్ధరించి, సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
యాప్ ఆధారిత చట్టవిరుద్ధ బైక్ టాక్సీ సేవలపై తక్షణమే నిషేధం విధించాలన్నారు జేఏసీ నేతలు. ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే ఒక అధికారిక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినందున దానికి అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలన్నారు. కార్మికులకు కనీస ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.