తెలంగాణలో భూ భారతి చట్టం - ముఖ్యమైన ఈ 10 అంశాలు తెలుసుకోండి

తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఆర్వోఆర్‌-2020ను రద్దు చేసి... ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ నూతన చట్టంలో కీలక అంశాలను పొందుపరిచారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియతో పాటు కీలక విషయాల్లో మార్పులు తీసుకువచ్చారు.

Published on: Apr 20, 2025, 06:02:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఆర్వోఆర్‌-2020 రద్దు చేసి... కొత్తగా భూ భారతిచట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారమే... నాలుగు మండలాల్లో సేవలు అందుతున్నాయి. ఈ జూన్ 2 వరకల్లా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

భూ భారతి చట్టం
భూ భారతి చట్టం

భూ భారతి చట్టం ప్రకారం పకడ్బందీగా భూ రికార్డుల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఎలాంటి వివాదాలు లేకుండా భూసమస్యలకు పరిష్కారం ఉంటుందని... రైతులకు ఇబ్బందులు లేకుండా కొత్త చట్టంలో కీలక సెక్షన్లను పొందుపర్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. భూ భారతి చట్టానికి సంబంధించిన కరపత్రాలను కూడా రైతులకు అందజేస్తున్నారు.

పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. ధరణిపోర్టల్‌ పేరును కూడా భూమాతగా మార్చారు. ఈ పోర్టల్ సేవలను ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద నాలుగు మండలాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే అన్ని మండలాల్లోనూ ఈ సేవలు ప్రారంభమవుతాయి. అయితే భూ భారతి చట్టంలో ప్రస్తావించిన వాటిలో కొన్ని కీలక అంశాలను ఇక్కడ తెలుసుకోండి...

తెలంగాణ భూ భారతి చట్టం - 10 కీలక అంశాలు

  1. ఈ ఏడాది జనవరి 9న ‘రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ యాక్ట్‌(RoR)-2025 భూ భారతి’ చట్టం రూపం దాల్చింది. ఈ కొత్త రెవెన్యూ చట్టం ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
  2. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డుల నిర్వహణ కోసం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారు. పకడ్బందీగా భూ హక్కుల రికార్డులను నిర్వహిస్తారు. తప్పుల సవరణకు కూడా అవకాశం ఉంటుంది.
  3. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయటానికి ముందు భూముల సర్వే నిర్వహిస్తారు. అంతేకాదు మ్యాప్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఫలితంగా హద్దుల విషయంలో ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి.
  4. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం చూపేందుకు ఈ కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది.
  5. ఇక వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ ఉంటుంది. కుటుంబ సభ్యుల అంగీకరపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి సమాచారం అందించటమే కాకుండా విచారణ తర్వాతనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందుకు 30 రోజుల గడువు నిర్ణయించారు. ఈ గడువులోపే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  6. భూ హక్కుల ఏ విధంగా సంక్రమించినప్పటికీ మ్యుటేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేస్తారు. కొత్తగా ఇచ్చే పాసుపుస్తకాల్లో సర్వే మ్యాప్ ఉంటుంది.
  7. భూ సమస్యల పరిష్కానిరి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. భూ హక్కుల రికార్డుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ధరణి వ్యవస్థలో అప్పీల్ వ్యవస్థకు చోటు కల్పించలేదు.
  8. ప్రతి కమతానికి భూ ఆధార్ కార్డులను అందజేస్తారు.ఈ చట్టం ప్రకారం… గ్రామకంఠం, ఆబాదీల‌‌‌‌పై కూడా హ‌‌‌‌క్కులను కట్టబెడుతారు.
  9. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తారు.ఇందుకోసం జిల్లాల్లో న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తారు.రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిస్కారానికి అవకాశం కల్పిస్తారు.
  10. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు అవకాశం కల్పించారు. అక్రమంగా ప్రభుత్వ భూములపై పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుంది.
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More