...
...
Next Story

Vemulawada Temple: వేములవాడ రాజన్న భక్తులకు శుభవార్త - వాట్సాప్ సేవలు ప్రారంభం, 'హాయ్' అంటే చాలు...

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం వాట్సాప్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇకపై చాలా సులభంగా దర్శనం, సేవల సమయాలను తెలుసుకోవచ్చు.

Published on: Feb 15, 2026, 07:33:16 IST
Advertisement

రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన శైవ క్షేత్రాల్లో వేములవాడ ఒకటి. నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ముఖ్యంగా మహాశివరాత్రి వేళ భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే తాజాగా భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆలయ అధికారులు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువవచ్చారు. భక్తులకు ఆలయ సమాచారాన్ని వేగంగా, పారదర్శకంగా అందించేందుకు "వాట్సాప్ చాట్‌బోట్" సేవలను ప్రారంభించారు.

వాట్సాప్ సేవలు ప్రారంభం
వాట్సాప్ సేవలు ప్రారంభం

మహాశివరాత్రి జాతర ప్రారంభమైన నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఈ డిజిటల్ సేవలు ఎంతో ఊరటనివ్వనున్నాయి. “Services in just a Few Clicks” అనే సందేశంతో భక్తులకు అవసరమైన సమాచారం మరియు సేవలను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఎలా ఉపయోగించాలి…?

ఆలయ పరిసరాల్లో అధికారులు ఏర్పాటు QR కోడ్ స్కాన్ చేయవచ్చు. లేదా 8736936969 నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపాలి. అలా చేస్తే వెంటనే వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా దేవస్థానం సేవల వివరాలు లభిస్తాయి.

దర్శన టికెట్ కౌంటర్లు,ప్రసాదం కౌంటర్,అన్న ప్రసాదం,రవాణా సదుపాయాలు,ఆసుపత్రి,దివ్యాంగులకు సౌకర్యాలు,తాగునీరు,మరుగుదొడ్లు,కళ్యాణ కట్ట,సమాచారం కేంద్రం,పోలీస్ స్టేషన్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది.

ఉదాహరణకు 1 నుంచి 12 వరకు సూచిన సంఖ్యలను బట్టి మీకు కావాల్సిన నెంబర్ ను నమోదు చేస్తే సంబంధిత సమాచారం పొందవచ్చు. ఈ డిజిటల్ సేవల ద్వారా భక్తులకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు సులభమైన సమాచారాన్ని అందించడం దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతిక భాగస్వామిగా ఆత్రేయ ఇన్ఫోటెక్ సంస్థ సేవలను అందించింది.

చుట్టపక్కల ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వేములవాడకు భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చే భక్తులకు ఆలయ కార్యక్రమాలు, పూజా విధానాల గురించి ముందే అవగాహన ఉండటం వల్ల వారి యాత్ర మరింత సులభమవుతుందని అధికారులు చెబుతు్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe