తెలంగాణలోని పల్లె ప్రాంతాలకు వాతావరణ ముందస్తు సమాచారం, అత్యవసర హెచ్చరికలను అత్యంత వేగంగా చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న అడుగు వేసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రారంభించిన 'మిషన్ మౌసమ్' (Mission Mausam) లో భాగంగా, ఇకపై పంచాయతీ స్థాయిలోనే నేరుగా వాట్సాప్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అందించనున్నారు.

బుధవారం (జూలై 22, 2026) లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మరియు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ నూతన విధానం ద్వారా పంచాయతీ సభ్యులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు వాతావరణ వివరాలు, వ్యవసాయ సలహాలు వాట్సాప్ ద్వారా ఆటోమేటిక్గా అందుతాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులు, పిడుగుపాట్లు, తీవ్రమైన ఎండలు, హీట్ వేవ్స్ సమాచారం గ్రామీణ ప్రాంతాలకు క్షణాల్లో చేరుతుంది.
దీనికోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పంచాయత్ మౌసమ్ సేవా పోర్టల్ను ఈ-గ్రామ్ స్వరాజ్ (e-GramSwaraj), మేరీ పంచాయత్ యాప్, ఈ-మాప్చిత్ర, మౌసమ్గ్రామ్ వంటి ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫామ్లతో అనుసంధానించారు. మారుమూల రైతులకు ఈ వివరాలు చేరవేసేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని కృషి సఖులు, పశు సఖుల నెట్వర్క్ను కూడా ఐఎండీ వినియోగించుకుంటోంది.
హైదరాబాద్లోని వాతావరణ కేంద్రంలో ఎస్-బాండ్ డాప్లర్ వెదర్ రాడార్ (Doppler Weather Radar) పనిచేస్తోందని, ఇది 250 కి.మీల ఎఫెక్టివ్ రేంజ్, 500 కి.మీల గరిష్ట పరిధితో తెలంగాణలోని అన్ని జిల్లాలకు పరిశీలన రక్షణ ఇస్తుందని మంత్రి తెలిపారు. దీనికి అదనంగా విశాఖపట్నం, మచిలీపట్నం, షోలాపూర్, నాగ్పూర్ రాడార్లు కూడా ఉపయోగపడుతున్నాయి.
తెలంగాణలోని ప్రస్తుత వాతావరణ మౌలిక వసతులు చూసుకుంటే.. హైదరాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 3 మానవీయ ఉపరితల పరిశీలనా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, రామగుండంలలో 2 రేడియో సోండే కేంద్రాలు ఉండగా... 31 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (AWS), 52 ఆటోమేటిక్ రెయిన్ గేజ్లు (ARG) ఉన్నాయి.
{{/usCountry}}తెలంగాణలోని ప్రస్తుత వాతావరణ మౌలిక వసతులు చూసుకుంటే.. హైదరాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 3 మానవీయ ఉపరితల పరిశీలనా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, రామగుండంలలో 2 రేడియో సోండే కేంద్రాలు ఉండగా... 31 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (AWS), 52 ఆటోమేటిక్ రెయిన్ గేజ్లు (ARG) ఉన్నాయి.
{{/usCountry}}జిల్లాల వారీగా 369 వర్షపాత మాపక కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. రైతులకు ప్రతి వారం మంగళవారం, శుక్రవారం రోజుల్లో పంటలు, వాతావరణంపై ఐఎండీ ప్రత్యేక హెచ్చరికలు, అగ్రికల్చర్ బులెటిన్లను విడుదల చేస్తుంది. నిజామాబాద్, జగిత్యాల వంటి ప్రధాన వ్యవసాయ జిల్లాల్లో వరి, పసుపు, జొన్న వంటి పంటలకు సంబంధించి ప్రత్యేకంగా 7 రోజుల ముందస్తు సూచనలు రోజుకు మూడుసార్లు, స్థానిక నౌకాస్ట్లు ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ హెచ్చరికలు అందడం వల్ల రైతులు పంట నష్టాన్ని నివారించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.