కరెంట్ ఎందుకు పోయింది? ఎప్పుడు వస్తుంది? TGSPDCL డిజిటల్ మ్యాపింగ్
తెలంగాణ సదరన్ డిస్కామ్ (TGSPDCL) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సమస్యల త్వరిత పరిష్కారం కోసం బుధవారం నుండి డిజిటల్ మ్యాపింగ్ డ్రైవ్ ప్రారంభించింది.
వినియోగదారులకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా Telangana Southern Power Distribution Company Limited(TGSPDCL) బుధవారం నుంచి ఒక కీలకమైన డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియను మెుదలుపెట్టింది. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతిక లోపాలను వేగంగా గుర్తించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

మొదటి దశలో భాగంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో ఈ డిజిటల్ మ్యాపింగ్ను అమలు అవుతుంది. ఈ సరికొత్త విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి వినియోగదారుడి ఇంటి వరకు ఉండే పూర్తి నెట్వర్క్ను డిజిటల్గా అనుసంధానం చేస్తారు.
132/33 కేవీ ఈహెచ్టీ (EHT) సబ్స్టేషన్ల నుండి 33/11 కేవీ సబ్స్టేషన్లు, 11 కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (DTR) మీదుగా.. ప్రతి వినియోగదారుడి సర్వీస్ కనెక్షన్ వరకు ఉండే మొత్తం నెట్వర్క్ను ఆన్లైన్ మ్యాప్లోకి తెస్తారు. విద్యుత్ శాఖ ఫీల్డ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ట్రాన్స్ఫార్మర్ల కోడ్లను ఫీడర్ల వారీగా తనిఖీ చేస్తారు.
జులై నెల బిల్లింగ్ సమయంలో మీటర్ రీడర్లు ప్రతి ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని ఇళ్లను సందర్శించి, వినియోగదారుల సర్వీస్ కనెక్షన్లను కచ్చితంగా మ్యాప్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. ఏ వినియోగదారుడికి ఏ సబ్స్టేషన్, ఏ ఫీడర్, ఏ ట్రాన్స్ఫార్మర్ నుండి కరెంట్ వస్తుందో కంప్యూటర్ స్క్రీన్పై స్పష్టంగా తెలిసిపోతుంది.
ఇకపై వినియోగదారులు 1912 కాల్ సెంటర్, వాట్సాప్, మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కరెంట్ పోయిందని ఫిర్యాదు చేయగానే.. సమస్య ఎక్కడ ఉందో సిస్టమ్ వెంటనే గుర్తిస్తుంది. దీనివల్ల చాలా వేగంగా కరెంట్ను పునరుద్ధరించడానికి వీలవుతుంది. అంతేకాకుండా కరెంట్ ఎందుకు పోయింది? ఎప్పటివరకు వస్తుంది? అనే వివరాలను కూడా పారదర్శకంగా తెలుసుకోవచ్చు.
ఈ డిజిటల్ నెట్వర్క్ వల్ల విద్యుత్ అంతరాయాలను ముందే గుర్తించవచ్చు. నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు లోడ్ మేనేజ్మెంట్ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. భవిష్యత్తులో స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ముందస్తు హెచ్చరికల సాంకేతికతను ప్రవేశపెట్టడానికి ఈ డిజిటల్ మ్యాపింగ్ ఒక బలమైన పునాదిగా మారనుంది. TGSPDCL ఆధునీకరణలో ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


