విద్యార్థులకు డిజిటల్ కానుక.. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా కాన్వా
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా ‘కాన్వా’ అందుబాటులో ఉండనుంది. దీనితో విద్యార్థులు తమ క్రియేటివిటీని మరింత మెరుగుపరుచుకోవచ్చు.
సాంకేతికత, సృజనాత్మకత ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్, ప్రముఖ గ్లోబల్ డిజైనింగ్ ప్లాట్ఫారమ్ 'కాన్వా' (Canva) మధ్య కుదిరిన అధికారిక భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు రాష్ట్రవ్యాప్తంగా ‘కాన్వా ఫర్ ఎడ్యుకేషన్’ (Canva for Education) ఉచిత యాక్సెస్ను కల్పించిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది.

డిజిటల్ లెర్నింగ్, ఫ్యూచర్-రెడీ ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే ప్రభుత్వ సంకల్పంలో ఈ చొరవ మరొక మైలురాయిగా నిలిచింది.
సాంకేతిక అనుకూలతలకు లోబడి, ఈ కాన్వా ప్లాట్ఫారమ్ను ఏపీ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ యాప్ అయిన ‘లీప్’ (LEAP - Learning Excellence in AP) తో పాటు, గూగుల్ వర్క్స్పేస్, పాఠశాలల్లో పంపిణీ చేస్తున్న క్రోమ్బుక్స్ లతో అనుసంధానం చేయనున్నారు. ఇది తరగతి గదుల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారికి అతుకులు లేని డిజిటల్ అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది.
అంతేకాకుండా ఈ కార్యక్రమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల బాధ్యతాయుతమైన, సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఉపాధ్యాయులు సురక్షితమైన అభ్యాసంతోపాటు సరికొత్త సాంకేతికతలను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'భవిష్యత్తు అనేది సృజనాత్మకంగా ఆలోచించగల, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల, పూర్తి ఆత్మవిశ్వాసంతో సాంకేతికతను ఉపయోగించుకోగల వారిదే. ఈ భాగస్వామ్యం ద్వారా, ఒకప్పుడు కేవలం కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి డిజిటల్ టూల్స్ను ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఉచితంగా అందించి వారిని సాధికారత వైపు నడిపిస్తున్నాం.' అని అన్నారు.
కేవలం సాంకేతికతను ఉపయోగించే వినియోగదారులను తయారు చేయడం మాత్రమే మా విజన్ కాదు; రేపటి తరం సృష్టికర్తలను, ఆవిష్కర్తలను, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే గ్లోబల్ లీడర్లను తయారు చేయడమే మా ప్రధాన లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ను భారతదేశపు నాలెడ్జ్, ఇన్నోవేషన్ క్యాపిటల్గా మార్చే ప్రయాణంలో ఈ సరికొత్త నిర్ణయం మరొక బలమైన అడుగు అని పేర్కొన్నారు.
డిజిటల్, కమ్యూనికేషన్, డిజైన్-థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంపొందించాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం. విద్యార్థులు కాన్వా టూల్స్ ఉపయోగించి ప్రజెంటేషన్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలు, గ్రాఫిక్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కంటెంట్ రూపొందించుకోవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


