...
...
Next Story

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. రాష్ట్ర సరిహద్దుల్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టింది!

హైదరాబాద్‌‌లో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను చంపేసింది. మృతదేహాన్ని తీసుకెళ్లి.. ఎక్కడో రాష్ట్ర సరిహద్దుల్లో పూడ్చిపెట్టింది.

Published on: Jul 7, 2026, 15:35:06 IST
Advertisement

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో అత్యంత కలకలం రేపిన ఓ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో.. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా అంతమొందించింది. ఆపై ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడింది. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ క్రూరమైన ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా బయటకొచ్చాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ నెలలో తన భర్త కనిపించడం లేదంటూ సదరు మహిళ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నెలలు గడుస్తున్నా అతడి ఆచూకీ లభించకపోవడం, మహిళ ప్రవర్తనలో కొన్ని తేడాలు గమనించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

ఈ కేసులో ఎలాంటి క్లూ దొరకకపోవడంతో మియాపూర్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. బాధితుడితో పాటు అతడి భార్యకు సంబంధించిన కాల్ డేటా రికార్డులను (CDR) క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విచారణలో సదరు మహిళ ఓ నంబర్‌తో గంటల తరబడి, తరచూ మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి వివరాలు సేకరించి, ఆ కోణంలో విచారించడంతో అసలు నిజం బయటపడింది.

భార్య తన ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని పూడ్చిపెట్టి, తిరిగి హైదరాబాద్ వచ్చి ఏమీ ఎరుగనట్లు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe