శివుడికి ప్రసాదంగా గంజాయి.. వీడియో వైరల్.. రీల్స్ బ్యాచ్‌పై పోలీసుల సీరియస్ యాక్షన్!

శివుడికి ప్రసాదంగా గంజాయిని సమర్పించారు కొందరు యువకులు. రీల్స్ కోసం చేసిన ఈ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Updated on: Feb 17, 2026, 14:55:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫేమస్ అవ్వడానికి కొంతమంది చేసే పనులు ఘోరంగా ఉంటున్నాయి. పవిత్రమై దేవాలయాల దగ్గర కూడా ఈ రీల్స్ పిచ్చి చాలామందికి ఎక్కువైపోయింది. ఏంకాదులే అని చేసే పనులతో చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కొందరు యువకులు శివరాత్రినాడు శివుడికి గంజాయి ప్రసాదంగా సమర్పించారు. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

శివుడికి ప్రసాదంగా గంజాయి.. పోలీసులు సీరియస్
శివుడికి ప్రసాదంగా గంజాయి.. పోలీసులు సీరియస్

మహాశివరాత్రి రోజున గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిందనే చెప్పాలి. దేవాలయం దగ్గర శివుడికి గంజాయిని ప్రసాదంగా సమర్పించారు కొందరు ప్రబుద్ధులు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది బాగా వైరల్ అయింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే సజ్జనార్ స్పందించారు.

వీడియోలో కనిపించిన వ్యక్తులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు సజ్జనార్. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోగి దిగారు, గాలింపు చర్యలు చేపడుతున్నారు.

హైదరాబాద్‌లోని శంషాబాద్ ధర్మగిరి దేవాలయం దగ్గర యువకులు శివుడికి ప్రసాదంగా గంజాయి సమర్పించినట్టుగా గుర్తించారు. దేవుడికి అందరూ కొబ్బరికాయ కొడతారు.. మేం మాత్రం ప్రత్యేకంగా గంజాయి ప్రసాదంగా సమర్పిస్తున్నాం అని యువకులు వీడియోలో చెప్పడం వినొచ్చు. ఇది కాస్త ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అయింది. సజ్జనార్ దృష్టికి వెళ్లింది. యువకులు బడంగ్‌పేట్‌కు చెందిన చరణ్‌తోపాటుగా అతడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చేస్తున్నారు.

'దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం! మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు.. ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి NDPS చట్టం ప్రయోగిస్తే.. జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. లైకుల కోసం - లోకాన్నే మరిచి.. వ్యూస్ కోసం - విలువలనే వదిలి.. రీల్స్ కోసం - రోడ్డున పడి.. మత్తులో మునిగి - జీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి.. వ్యసనాలకు వాకిలిగా కాదు.' అని సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More