మానవత్వం ఇంకా చాలా మందిలోనే ఉంది. అవసరమైనవారి గుండె తడిని అర్థం చేసుకునేవారు ఇంకా లోకంలో చాలా మందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న చిట్టితల్లి పునర్విక ఘటనే ఇందుకు ఉదాహరణ. సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలు ఏకమై.. పునర్వికకు పునర్జన్మను ప్రసాదించారనే చెప్పాలి. రూపాయి.. రెండు రూపాయలు కాదు.. ఏకంగా రూ.16 కోట్లను సమకూర్చారు. ఇది జరిగే పనేనా అనుకున్నవారంతా ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. పునర్విక ఇంజక్షన్ కోసం రూ.16 కోట్లు సమకూరినట్టుగా తాజాగా పాప తండ్రి సురేష్ కుమార్ వెల్లడించారు. డబ్బులు ఇక ఎవరూ కలెక్ట్ చేయెుద్దని కోరారు.

కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన పదకొండు నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను సోషల్ మీడియా కాపాడింది. ఆమె వెన్నెముక కండరాల క్షీణత (SMA టైప్-1) అనే అరుదైన, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది. ఇది క్రమంగా కండరాల క్షీణతకు దారితీస్తుంది.
16 కోట్ల రూపాయల విలువైన చికిత్స అవసరం అని వైద్యులు సిఫార్సు చేశారు. కానీ ఆ పాప ఫ్యామిలీ అంత డబ్బు పెట్టుకునే స్థితిలో లేదు. రెక్కాడితేనే డొక్కా నిండేలా వారి జీవితాలు ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా తన పాపను బ్రతికించుకునేందుకు తండ్రి సురేష్ ప్రయత్నం మెుదలుపెట్టాడు.
'నేను సెలూన్ షాప్ ద్వారా జీవనోపాధి పొందుతున్నాను. నాకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. నా కూతురి పేరు పునర్విక. ఆమె గర్భంలో ఉన్నప్పుడు వైద్యులు సమస్యలను గుర్తించారు. ప్రసవం వరకు వేచి ఉండి పరిస్థితిని అంచనా వేయాలని మేం నిర్ణయించుకున్నాం. తరువాత ఇది చాలా ఖరీదైన చికిత్స అని తెలిసింది. చాలా అరుదైన వ్యాధి. అందుకే నేను దాతల సహాయం కోసం విజ్ఞప్తి చేశాను.' అని సురేష్ చెప్పారు.
ఆ కుటుంబం పడుతున్న బాధను చూసిన సోషల్ మీడియా సమాజం.. వెంటనే స్పందించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఫండ్ రైజింగ్కు సాయం చేశారు. సోషల్ మీడియా ప్రచారాల ద్వారా విరాళాలు అందించారు. రూ. 10 కోట్లకు పైగా సేకరించారు. మిగిలిన ఆరు కోట్లు కావాలని సురేష్ ఎక్స్ వేదికంగా మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూ.10 కోట్లు సేకరించినట్టుగా, వేలాది మంది ప్రజల దాతృత్వానికి వందనం చేస్తున్నానని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఆమెకు రూ. 6 కోట్ల బ్యాలెన్స్ వచ్చేలా చూసుకోవడం నా వంతు అని హామీ ఇచ్చారు. దీనితో పాప చికిత్స కోసం రూ.16 కోట్లు కలెక్ట్ అయ్యాయి.
{{/usCountry}}ఆ కుటుంబం పడుతున్న బాధను చూసిన సోషల్ మీడియా సమాజం.. వెంటనే స్పందించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఫండ్ రైజింగ్కు సాయం చేశారు. సోషల్ మీడియా ప్రచారాల ద్వారా విరాళాలు అందించారు. రూ. 10 కోట్లకు పైగా సేకరించారు. మిగిలిన ఆరు కోట్లు కావాలని సురేష్ ఎక్స్ వేదికంగా మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూ.10 కోట్లు సేకరించినట్టుగా, వేలాది మంది ప్రజల దాతృత్వానికి వందనం చేస్తున్నానని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఆమెకు రూ. 6 కోట్ల బ్యాలెన్స్ వచ్చేలా చూసుకోవడం నా వంతు అని హామీ ఇచ్చారు. దీనితో పాప చికిత్స కోసం రూ.16 కోట్లు కలెక్ట్ అయ్యాయి.
{{/usCountry}}ధులను సమీకరించడంతో చికిత్స ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని వైద్యులు ఇప్పుడు చెప్పారు. మరో మూడు నాలుగు రోజుల్లో పాప హెల్త్పై అప్డేట్ రానుంది. అంతకుముందు నటుడు మంచు మనోజ్ కూడా తన సపోర్ట్ అందించాడు. కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు.
నంద్యాల ఎంపీ మరియు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కూడా వారికి మెుదటి నుంచి సాయంగా ఉంటూ వచ్చారు. బొమ్మలసత్రంలోని ఆమె కార్యాలయంలో ప్రజా దర్బార్ సందర్భంగా సహాయం కోరుతూ తనను సంప్రదించారని ఎంపీ చెప్పారు.