తిరుమలలో నెయ్యి క్వాలిటీ చెక్ కోసం 'ఈ-టంగ్, ఈ-నోస్‌'.. రూ.25 కోట్లతో ఫుడ్ ల్యాబ్

తిరుమలలో నూతన టెక్నాలజీతో రూ.25 కోట్లతో ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు కానుంది. ప్రసాదాల్లో నాణ్యత తగ్గినా వెంటనే పసిగట్టేందుకు ఈ-టంగ్, ఈ-నోస్ యంత్రాలు సమకూరుస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

Published on: Feb 23, 2026, 14:16:04 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రసాదం, యాత్రికులకు అందించే ఆహారం భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమలలో రూ.25 కోట్లతో అత్యాధునిక ఆహార ప్రయోగశాలను ప్రారంభించనుంది. ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ టంగ్ (ఈ-టాంగ్), ఎలక్ట్రానిక్ నోస్ (ఈ-నోస్) యంత్రాలు రానున్నాయి. అధునాతన పరీక్షా పరికరాలతో కూడిన ఈ సౌకర్యం వచ్చే నెలలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి.

తిరుమల
తిరుమల

శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, చక్కెరతో పాటు, పూర్తయిన ప్రసాదం, ఆహార పదార్థాలు, భక్తులకు సరఫరా చేసే నీరు వంటి దాదాపు 60 ముడి పదార్థాలను ఈ ప్రయోగశాల పరీక్షిస్తుంది. రూ.3.5 కోట్ల అదనపు ఖర్చుతో సేకరించిన ఈ-టంగ్, ఈ-నోస్ వ్యవస్థలు నెయ్యిలో స్వల్ప నాణ్యతా తగ్గినా, కల్తీని కూడా గుర్తించగలవు.

ఈ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమల్లోకి వచ్చింది. రాష్ట్రం అభ్యర్థన మేరకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) రూ.23 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ, FSSAI మధ్య అక్టోబర్ 8, 2024న న్యూఢిల్లీలో ఒక ఒప్పందంపై సంతకం జరిగింది.

తిరుమల పిండి మిల్లు ప్రాంగణంలో పునరుద్ధరించిన 12,000 చదరపు అడుగుల రెండంతస్తుల భవనంలో ఈ ప్రయోగశాల ఉంటుంది. ఆరోగ్య శాఖ, టీటీడీ నుండి సుమారు 50 పరికరాలు, 40 మంది సిబ్బంది కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ ల్యాబ్​లో టీటీడీ జలప్రసాదాల నమూనాలను సైతం టెస్ట్ చేస్తారు. ఇందుకోసం 50 రకాల పరికరాలు, దీనికి సంబంధించిన యంత్రాలు ఏర్పాటు జరుగుతాయి.

ఇప్పటికే సుమారు 90 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అయితే ఈ-టంగ్, ఈ నోస్ యాంత్రాలను ఈ ఏడాది మే నెల నాటికి తీసుకువస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More