జూన్ 15తో ముగియనున్న 61 రోజుల చేపల వేట నిషేధం.. సముద్రంలోకి దూసుకెళ్లనున్న బోట్లు
ఆంధ్రప్రదేశ్లో 61 రోజుల చేపల వేట నిషేధం ముగియనుంది. దీంతో మత్స్యకారులు చేపల వేట కోసం రెడీ అవుతున్నారు. చేపల వేటకు వెళ్లిన మెుదటివారంలో ధరలు భారీగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఏపీలో వార్షిక 61 రోజుల చేపల వేట నిషేధం జూన్ 15తో ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత గ్రామాల్లో ఒకరకమైన ఉత్సాహం నెలకొంది. అక్కడి మత్స్యకారులు కొత్త సీజన్ కోసం తమ పడవలను, వలలను సిద్ధం చేసుకుంటూ తీరిక లేకుండా ఉన్నారు. రాబోయే నెలల్లో అనుకూలమైన వాతావరణం, చేపలను అధికంగా పట్టడం, మెరుగైన ఆదాయాలపై మత్స్యకారులు ఆశలు పెట్టుకున్నారు.

సముద్ర జీవుల సంతానోత్పత్తి, చేపల సంపద పరిరక్షణ కోసం వీలు కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు విధించే ఈ నిషేధం, వేలాది మంది మత్స్యకారులను దాదాపు రెండు నెలల పాటు ఒడ్డునే ఉంచింది. ఈ ఆంక్షను ఎత్తివేయనున్న నేపథ్యంలో మత్స్య రేవులలో, గ్రామాలలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అక్కడ మత్స్యకారులు పడవలకు మరమ్మతులు చేయడం, వలలను బాగుచేయడం, అలాగే తమ ప్రయాణానికి అవసరమైన కొత్త పరికరాలు, ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువులను సమకూర్చుకునే పనిలో పడ్డారు.
చాలా మంది జాలర్లు తరతరాల సంప్రదాయాలను కూడా ఫాలో అవుతుంటారు. సాధారణంగా సముద్రంలోకి వెళ్లే ముందు పూజారులను సంప్రదించి, శుభ ముహూర్తాన్ని చూసుకుంటారు.
నిషేధ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార సేవలో పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. సుమారు 1.30 లక్షల మత్స్యకారుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున, మొత్తం రూ. 261.5 కోట్లతో ఆదుకుంది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత చేపల వేట పునఃప్రారంభం కావడంతో తాజా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు మార్కెట్లకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే మెుదట్లో పరిమిత లభ్యత, అధిక డిమాండ్ కారణంగా తొలి వారాల్లో సముద్రపు చేపల ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. తాజా చేపలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఓడరేవులు, చేపల ల్యాండింగ్ కేంద్రాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
చేపల వేట కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడం వల్ల చేపల మార్కెట్లు, అనుబంధ రంగాలు పునరుజ్జీవం పొందనున్నాయి. తద్వారా సముద్ర ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన వేలాది మంది ప్రజలకు జీవనోపాధి పునరుద్ధరించబడుతుంది.
మరోవైపు ఎప్పుడూ మత్స్యకారులు, చేపలతో సందడి సందడిగా కనిపించే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రస్తుతం సందడి లేకుండా ఉన్నది. రోజూ వందలాది బోట్ల రాకపోకలతో బాగుండే జెట్టీ, గత రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ఇప్పుడు జూన్ 15 నుంచి ఇక మళ్లీ సందడి మెుదలుకానుంది. దీంతో మత్స్యకారులు ఉత్సహంగా ఉన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


