పీఎం ఈ-బస్ సేవా స్కీమ్.. ఏపీఎస్ఆర్టీసీలో 750 ఎలక్ట్రిక్ బస్సులు!
ఏపీఎస్ఆర్టీసీలోకి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. పీఎం ఈ బస్ సేవా పథకంలో భాగంగా ఈ బస్సులకు కేంద్రం కేటాయించింది.
పట్టణ రవాణాకు ప్రోత్సాహకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) త్వరలో పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. దీని ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం, పట్టణ వాయు నాణ్యతను మెరుగుపరచడం, ప్రజా రవాణా సేవలను ఆధునీకరించడం లక్ష్యం.

పినాకిల్ ఇండియా అనే సంస్థ ఈ బస్సులను నడపనుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఎంపిక చేసిన ఆపరేటర్కు ఇప్పటికే లెటర్ ఆఫ్ అవార్డు (LoA) జారీ చేశారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను త్వరగా ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయిందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. త్వరలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, క్లీన్ మొబిలిటీ సొల్యూషన్స్ను అవలంబిస్తున్న ప్రముఖ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ను స్థానం సంపాదించుకుంటుందని భావిస్తున్నారు.
ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) అనుబంధ సంస్థ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించింది. సీఈఎస్ఎల్ ఇటీవల PM E-DRIVE (పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) పథకం కింద 10,900 ఎలక్ట్రిక్ బస్సుల కోసం భారతదేశంలో అతిపెద్ద మెగా టెండర్ను ముగించింది.
సీఈఎస్ఎల్ అంచనాల ప్రకారం, ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం వల్ల డీజిల్తో నడిచే బస్సులను మార్చడం ద్వారా నాలుగు మిలియన్ టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత, శబ్ద తగ్గింపు, మొత్తం జీవన నాణ్యతలో మెరుగుదల కనిపిస్తుంది.
సీఈఎస్ఎల్, ఈఈఎస్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అఖిలేష్ కుమార్ దీక్షిత్ కేంద్ర భారీ పరిశ్రమలు, విద్యుత్ మంత్రిత్వ శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు. 2070 నాటికి భారతదేశం ప్రజా రవాణాను ఆధునీకరించడంలో సహాయపడుతుందని అన్నారు.
PM E-DRIVE పథకం కింద, దేశవ్యాప్తంగా మొత్తం 14,028 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు అయ్యాయి. ప్రధాన నగరాలు, రాష్ట్ర రవాణా సంస్థలను కవర్ చేసేలా 10,900 బస్సులకు మొదటి దశలో టెండర్లు జారీ అయ్యాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


