Nepal Flash Floods : నేపాల్ వరదల్లో 8 మంది ఏపీ యాత్రికుల ఆచూకీ గల్లంతు - కొనసాగుతున్న అత్యవసర చర్యలు

Nepal Flash Floods : నేపాల్‌ను ముంచెత్తిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఆంధ్రాకు చెందిన 8 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా 288 మంది భారతీయుల ఆచూకీ దొరకడం లేదు. 

Published on: Aug 27, 2026, 17:43:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nepal Flash Floods : నేపాల్‌ను హఠాత్తుగా ముంచెత్తిన ఫ్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) అక్కడ పర్యటిస్తున్న భారతీయ యాత్రికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాణాంతక వరదల ధాటికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కనీసం ఎనిమిది మంది యాత్రికులు దారితెలియని పరిస్థితుల్లో చిక్కుకుపోయారని…. వారి ఆచూకీ దొరకడం లేదని నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రాథమికంగా ధృవీకరించింది.

నేపాల్ వరదల్లో 8 మంది ఏపీ యాత్రికుల ఆచూకీ గల్లంతు
నేపాల్ వరదల్లో 8 మంది ఏపీ యాత్రికుల ఆచూకీ గల్లంతు

చైనా సరిహద్దు ప్రాంతాల్లో మిస్సింగ్….

రాయబార కార్యాలయం వెల్లడించిన జాబితా ప్రకారం…. టిబెట్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చోప్పరపు రమేష్ బాబు (53), అన్నందేవర వెంకట్రామ్ (52), అన్నందేవర అనఘ (49)లు ఉన్నట్లు చివరిసారిగా సమాచారం అందింది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సంబంధాలు తెగిపోయాయి. మరో యాత్రికుడు బాల సుబ్రహ్మణ్యం కూడా గల్లంతయ్యాడు…. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు.

ఇక శశికుమార్ అట్లూరి, రాజ్యలక్ష్మి నిమ్మగడ్డలు చైనాలోని 'గిరోంగ్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్' వద్ద చివరిసారిగా కనిపించినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు సురక్షితంగానే ఉన్నప్పటికీ, వరదల కారణంగా బయటకు రాలేక అక్కడ చిక్కుకుపోయినట్లు తెలిసింది. ఆగస్టు 26 సాయంత్రం నాటికి అపర్ణ కాకాని అనే మహిళ సురక్షితంగా ఉన్నారని…. అధికారులు ఆమె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని రాయబార కార్యాలయం తెలిపింది.

నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదల వల్ల మొత్తం 288 మంది భారతీయ పౌరులతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయిందని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన దాదాపు 200 మంది భారతీయులు తమను సురక్షితంగా తరలించాలని (ఎవాక్యుయేషన్) ప్రభుత్వ సహాయాన్ని కోరారు.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ…. ఈశా ఫౌండేషన్‌కు చెందిన పెద్ద సంఖ్యలో సభ్యులు కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఆచూకీ లేకుండా పోయారని తెలిపారు. అదే సమయంలో తమిళనాడుకు చెందిన 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు. చైనా సరిహద్దు వైపున కూడా కొంతమంది భారతీయులు చిక్కుకుపోయారని ఆయన వివరించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమవ్వడం వల్ల బాధితులను సంప్రదించడం సవాలుగా మారిందని జైస్వాల్ తెలిపారు. విపత్తులో నలిగిపోతున్న నేపాల్‌కు భారత్ తక్షణ సహాయంగా నిత్యావసర సరుకులు, సహాయక సామగ్రితో కూడిన రెండు ప్రత్యేక విమానాలను పంపించిందని పేర్కొన్నారు.

ఆచూకీ లభించని 288 మంది భారతీయుల వివరాలను విదేశాంగ శాఖ సమగ్రంగా వర్గీకరించింది. ఆ వివరాలు ఇలా….

  • త్రిశూలి-1 ప్రాజెక్ట్: త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయుల మొదటి బృందం. వారి క్షేమ సమాచారాల కోసం కాఠ్మండులోని మన రాయబార కార్యాలయం ప్రాజెక్టు హెడ్‌తో నిరంతరం మాట్లాడుతోంది.
  • తమిళనాడు బృందాలు : సామ్రాట్, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్స్ ద్వారా మానససరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 37 మంది, 49 మంది ఉన్న రెండు వేర్వేరు బృందాలు.
  • పశ్చిమ బెంగాల్ బృందం : రసువా జిల్లాలోని తీమురే ప్రాంతంలో సామ్రాట్ ట్రావెల్స్ సాయంతో పర్యటిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన 32 మంది బాధితులు.
  • ఇతర రాష్ట్రాలు, కేరళ బృందాలు : వివిధ రాష్ట్రాలకు చెందిన 61 మంది భారతీయులతో కూడిన మరొక బృందం, అలాగే కేరళకు చెందిన 33 మంది సభ్యుల బృందం.

ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా వెలికితీసి భారతదేశానికి రప్పించడానికి రాజకీయాధికారులు, నేపాల్ ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తున్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More