...
...
Next Story

అగ్రికల్చరల్‌ కాలేజీలో టీచింగ్‌ అసోసియేట్‌ నోటిఫికేషన్.. జీతం 60వేల పైనే!

శ్రీకాకుళం జిల్లా నైరాలోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని అగ్రికల్చరల్‌ కాలేజీలో ఖాళీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. అర్హత గల అభ్యర్థులను ఇంటర్వ్యూ దారా ఎంపిక చేస్తారు.

Published on: Jan 15, 2026, 17:50:34 IST
Advertisement

శ్రీకాకుళం జిల్లా నైరాలోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని అగ్రికల్చరల్‌ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థుల జనవరి 27న హాజరు కావాల్సి ఉంటుంది.

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ జాబ్స్
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ జాబ్స్

అర్హతల విషయానికొస్తే.. బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా కావాలి. పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, నేరా, అగ్రికల్చర్‌ కాలేజ్‌‌లో 27-01-2026న ఇంటర్వ్యూ ఉంటుంది.

ఈ పోస్టు కోసం వచ్చేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పూర్తిగా తాత్కాలిక, కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులవుతారు. రెగ్యులర్ సిబ్బందిని భర్తీ చేసిన తర్వాత రద్దు చేస్తారు. విశ్వవిద్యాలయం/ఏదైనా ప్రభుత్వ సంస్థలో ఏదైనా రెగ్యులర్ నియామకం కోసం క్లెయిమ్ చేసుకునే హక్కును కలిగి ఉండరు.

ఉద్యోగి ఎటువంటి క్లెయిమ్ (లేదా) ఒప్పంద సేవను కొనసాగించడానికి ఎటువంటి హక్కును కలిగి ఉండరు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు.. వాస్తవాలను దాచిపెట్టడం లేదా ఏ రూపంలోనైనా మోసానికి పాల్పడితే.. ఒప్పంద ఉద్యోగిని తొలగిస్తారు. ముందస్తు నోటీసు లేకుండా లేదా ఏదైనా కారణం చూపకుండా ఎప్పుడైనా ఒప్పంద ఉద్యోగి నియామకాలను రద్దు చేయవచ్చు.

ఉద్యోగి నియామకం పొందిన వ్యక్తులు ఒక నెల నోటీసు పిరియడ్ ఇవ్వడం ద్వారా స్వయంగా ఒప్పంద సేవను వదిలివేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు నియామకానికి ముందు వారి శారీరక దృఢత్వాన్ని నిర్ధారించుకోవడానికి నిబంధనల ప్రకారం వారి స్వంత ఖర్చులతో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ ఇవ్వరు. పై పోస్ట్ కోసం ఎంపిక అనేది కమిటీదే తుది నిర్ణయం ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe