విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 30 నిమిషాలకు ఒక 'ఏరో ఎక్స్ప్రెస్' ఏసీ బస్సు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారి ఆర్ఎమ్బీ అప్పలనాయుడు వెల్లడించారు.

మొదటి ఏరో ఎక్స్ప్రెస్ సర్వీస్ పాత గాజువాక నుంచి ఉదయం 04:55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ బస్సు ఎయిర్పోర్ట్ మీదుగా మద్దిలపాలెం వైపు ప్రయాణిస్తుంది. ఇదే రూట్లో చివరి బస్సు సేవ రాత్రి 07:45 గంటలకు బయలుదేరుతుంది. రోజంతా ప్రతి 30 నిమిషాలకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ ఏసీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు అందుబాటు ధరల్లోనే ఈ సేవలను అందిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఛార్జీలు కింది విధంగా ఉన్నాయి.
పాత గాజువాక : రూ. 400
గురుద్వార్ : రూ. 300
జూ పార్క్ : రూ. 250
మధురవాడ / మారీకవలస : రూ. 150
తగరపువలస : రూ. 100
ఈ ఏరో ఎక్స్ప్రెస్ ఏసీ బస్సుల సీట్లను ప్రయాణికులు ముందస్తుగా APSRTC అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఆర్టీసీ కౌంటర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. అలాగే బస్సులోనే కండక్టర్ వద్ద నేరుగా టికెట్ పొందే వెసులుబాటు ఉంది. విమాన ప్రయాణికుల వద్ద ఉండే పెద్ద లగేజ్ బ్యాగులను సురక్షితంగా ఉంచేందుకు ఈ ప్రత్యేక ఏసీ బస్సులలో విశాలమైన లగేజ్ స్పేస్ను ఏర్పాటు చేశారు.
విమాన సర్వీసుల సమయాలకు అనుగుణంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు చేరుకునేలా ఈ బస్సు సర్వీసులను షెడ్యూల్ చేశారు. విశాఖపట్నం, విజయనగరం పరిసర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి వెళ్లేవారికి సొంత క్యాబ్లు లేదా ప్రైవేట్ టాక్సీల ఖర్చులు భారంగా మారకుండా, ఈ ఏరో ఎక్స్ప్రెస్ సర్వీసులు అత్యంత సౌకర్యవంతమైన, చవకైన రవాణా ప్రత్యామ్నాయంగా నిలవనున్నాయి.
{{/usCountry}}విమాన సర్వీసుల సమయాలకు అనుగుణంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు చేరుకునేలా ఈ బస్సు సర్వీసులను షెడ్యూల్ చేశారు. విశాఖపట్నం, విజయనగరం పరిసర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి వెళ్లేవారికి సొంత క్యాబ్లు లేదా ప్రైవేట్ టాక్సీల ఖర్చులు భారంగా మారకుండా, ఈ ఏరో ఎక్స్ప్రెస్ సర్వీసులు అత్యంత సౌకర్యవంతమైన, చవకైన రవాణా ప్రత్యామ్నాయంగా నిలవనున్నాయి.
{{/usCountry}}భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం (ఆగస్టు 17) పౌర విమాన రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో సంస్థకు చెందిన తొలి విమానం ఈ రన్వేపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని తొలి విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లను అందజేసి వారి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు.