Vizag Fire Accident : స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!
Vizag Fire Accident : విశాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ షాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడ్డాయి.
విశాఖపట్నంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక స్క్రాప్ దుకాణం గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నామని, అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. టౌన్ కొత్త రోడ్డులో ఉన్న స్క్రాప్ దుకాణంలో మొదలైన మంటలు క్షణాల్లోనే చుట్టుపక్కల ఉన్న పలు దుకాణాలకు వ్యాపించాయి.

సుమారు రెండు గంటల పాటు ఈ మంటలు చెలరేగాయి. ఆరు అగ్నిమాపక వాహనాల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించి ఉండవచ్చని స్థానికులు అన్నారు. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేశారు. 'ఇలా అగ్నిప్రమాదం సంభవించడం ఇది రెండోసారి. దీనికి షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు లేదా మరేదైనా కారణం ఉండవచ్చు. మాకు విషయం తెలియగానే, మేం అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించాం. సహాయక చర్యల్లో పాల్గొనడానికి ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయి. ఎటువంటి గాయాలు లేవు, ప్రాణనష్టం లేదు, అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.' అని స్థానికుడు ఒకరు తెలిపారు.
అగ్నిప్రమాద ఘటనతో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు ధృవీకరించారు. స్క్రాప్ షాపులో భారీ పరిమాణంలో చెక్క సామాగ్రి, వ్యర్థ నూనె నిల్వ ఉండటం వల్ల మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అయినప్పటికీ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలకు చెందిన సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉండి.. మంటలను ఆర్పేందుకు ముమ్మరంగా కృషి చేశారు.
విషయం తెలిసిన వెంటనే.. నాలుగు అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపామని అగ్నిమాపక అధికారి సత్యనారాయణ అన్నారు. ఆ తర్వాత మరో మూడు వాహనాలను కూడా పంపామన్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. దాదాపు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


