Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు ప్రాక్టికల్ రీ-ఎగ్జామ్స్
Andhra University : యూజీ విద్యార్థులకు ప్రాక్టికల్ రీ-ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 10వ తేదీలోపు తమతమ పరీక్షా కేంద్రాలను సంప్రదిస్తే షెడ్యూల్ తెలుస్తుందని వెల్లడించింది.
జూన్ 2026లో జరిగిన యూజీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా తమతమ పరీక్షా కేంద్రాలలో పరీక్షలకు హాజరు కాలేకపోయిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాక్టికల్ పునఃపరీక్షలను నిర్వహించనుంది. బి.ఏ., బి.ఎస్సీ., బి.ఏ.(ఓరియంటల్ లెర్నింగ్), బి.కామ్. (కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ జనరల్), బి.బి.ఏ., బి.సి.ఏ, బి.హెచ్.ఎం అండ్ సిటి కోర్సులకు ఈ పునఃపరీక్షలు నిర్వహిస్తారు.
ఆంధ్ర యూనివర్సిటీ
{{^htLoading}} {{/htLoading}}
ఈ అవకాశాన్ని ప్రకటిస్తూ డిప్యూటీ రిజిస్ట్రార్(యూజీ పరీక్షలు) ఎం. పద్మరాజు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులు, తేదీ, సమయం, ప్రాక్టికల్ పేపర్ వివరాలు తెలుసుకోవడానికి సెప్టెంబర్ 10, 2026 లోగా తమతమ పరీక్షా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత సమయంలో పరీక్షలకు హాజరు కావాలని విశ్వవిద్యాలయం విద్యార్థులకు సూచించింది.
AUEET-2026 కౌన్సెలింగ్ చివరి దశ షెడ్యూల్
ఆంధ్ర విశ్వవిద్యాలయం అడ్మిషన్ల డైరెక్టరేట్ AUEET-2026 కౌన్సెలింగ్ చివరి దశ షెడ్యూల్ను ప్రకటించింది. రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ అప్లోడింగ్ సెప్టెంబర్ 1 నుండి 3 వరకు అందుబాటులో ఉంటాయి. మూడో దశ తర్వాత ఖాళీల వివరాలు సెప్టెంబర్ 3న ప్రదర్శిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 4, 5 తేదీలలో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. తాత్కాలిక సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 7న జరుగుతుంది.
ఫీజు చెల్లింపులను సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 11న ఆఫ్లైన్లో హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కూడా సీట్లు పొందలేని అభ్యర్థులు, ఆప్షన్లను ఎంచుకోని వారు, సీట్లు పొందిన తర్వాత మెరుగైన అవకాశాల కోసం చూస్తున్న వారు ఇందులో పాల్గొనవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్తో కొత్త రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతి ఉంది. అభ్యర్థులు కొత్త ఆప్షన్లను ఎంచుకోకపోతే, ఇప్పటికే ఉన్న కేటాయింపులు కొనసాగుతాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.