కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో జూలై నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దర్శన వేళల్లో, సేవలలో పలు కీలక మార్పులు చేసింది. శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆణివార ఆస్థానం’ కొలువును ఘనంగా నిర్వహించనున్నారు.

దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే ఈ చారిత్రాత్మక ఉత్సవాన్ని పురస్కరించుకుని, ఆలయ సాంప్రదాయాల ప్రకారం అంతకుముందు వచ్చే మంగళవారం అంటే జూలై 14న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ (ఆలయ శుద్ధి కార్యక్రమం) జరపనున్నారు.
ఈ రెండు ప్రధాన ఉత్సవాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన ఇతరులందరికీ జూలై 14, జూలై 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ఇందులో భాగంగా జూలై 13, జూలై 16వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలనూ కార్యాలయంలో స్వీకరించబోరని అధికారులు స్పష్టం చేశారు. కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శన సౌకర్యం ఉంటుంది.
ఆర్జిత సేవలు రద్దు
ఉత్సవాల నిర్వహణ దృష్ట్యా జూలై 17న శ్రీవారి ఆలయంలో నిత్యం జరిగే పలు ఆర్జిత సేవలను కూడా అధికారులు రద్దు చేశారు. ఆ రోజున నిర్వహించాల్సిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంతో పాటు సహస్ర దీపాలంకరణ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ పవిత్రమైన రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే భక్తులు ఈ సేవల రద్దు, దర్శన సమయాల్లో మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ పర్యటనను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}ఈ పవిత్రమైన రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే భక్తులు ఈ సేవల రద్దు, దర్శన సమయాల్లో మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ పర్యటనను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}