Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠం తిరుమలకు ముఖద్వారమైన తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. మే 31 వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మే 22వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారు వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ముఖ్య ఘట్టాలు - వాహన సేవలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి.
- మే 23 – ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
- మే 24 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరించనున్నారు.
- మే 25 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనసేవ భక్తులను అలరించనున్నాయి.
- మే 26 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
- మే 27 – ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులను కటాక్షించనుండగా, రాత్రి జరిగే గరుడవాహనసేవ బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
- మే 28 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనసేవలు భక్తులను భక్తిరసంలో ముంచెత్తనున్నాయి.
- మే 29 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
- మే 30 – ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుండగా, రాత్రి అశ్వవాహనసేవ నిర్వహించనున్నారు.
- మే 31 – ఉదయం చక్రస్నాన మహోత్సవం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి.
ఉత్సవాల సందర్భంగా టీటీడీ (TTD) ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్ట్, హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి సంగీత సభలు నిర్వహించనున్నారు.
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయాన్ని శుద్ధి చేసే సంప్రదాయమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని మే 18న నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది.
{{/usCountry}}బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయాన్ని శుద్ధి చేసే సంప్రదాయమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని మే 18న నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది.
{{/usCountry}}పసుపు, కుంకుమ, గంధం, కస్తూరి, పచ్చాకు వంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయ గోడలు, పైకప్పుకు ప్రోక్షణం చేస్తారు. ఈ శుద్ధి అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.