ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీన్ అన్సారీని కలిసి.. స్పాట్ వాల్యుయేషన్ విధులకు సంబంధించిన సమస్యలపై చర్చించింది. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారికి 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ విధుల నుండి మినహాయింపు ఉండాలి.. కానీ దానికి విరుద్ధంగా కొన్ని సందర్భాల్లో వారికే ఆ విధులు అప్పగించారని ఏపీటీఎఫ్ ఆరోపించింది.

అంతేకాకుండా 10వ తరగతికి బోధించని ఉపాధ్యాయులకు కూడా ఈ పనిని అప్పగించారని ఉపాధాయ్య సమాఖ్య చెబుతోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులతో పాటు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న మండలాలకు చెందిన ఉపాధ్యాయులను కూడా స్పాట్ విధుల నుండి మినహాయించాలని కోరింది.
అన్నమయ్య జిల్లా నుండి తిరుపతిలో విలీనమైన మండలాల ఉపాధ్యాయులకు కూడా స్పాట్ విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని సమాఖ్య నాయకులు కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష నిర్వహించి, సిలబస్ నుండి అశాస్త్రీయమైన అంశాలను తొలగించాలని కూడా సమాఖ్య నాయకులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించాలన్నారు.
ఏపీ టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 15వ తేదీ తో అన్ని సబ్జెక్ట్ పేపర్లను పూర్తి చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాచరణను సిద్ధం చేసింది. స్పాట్ జరిగే కేంద్రాలతో పాటు సిబ్బంది నియామకం, ఇతర అంశాలపై ఫోకస్ పెట్టింది.
గతేడాది టెన్త్ మార్కుల కౌంటింగ్లో కొన్ని తప్పిదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా స్పాట్ ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తప్పు చేసిన సిబ్బందికి జరిమానా విధించేలా నిబంధనలు తీసుకొచ్చింది. ఈసారి ట్యాబ్లలో మార్కులు నమోదు చేయనున్నారు. పేపర్ల మూల్యాంకనంతో పాటు మార్కుల ఎంట్రీ వరకు ప్రతిదీ దశల వారీగా చేసి ప్రాసెస్ పూర్తి చేస్తారు.
ఏప్రిల్ 1వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. ఈసారి మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు, 18,842 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. ఏప్రిల్ మూడో వారం లేదా నాల్గో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
{{/usCountry}}ఏప్రిల్ 1వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. ఈసారి మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు, 18,842 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. ఏప్రిల్ మూడో వారం లేదా నాల్గో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
{{/usCountry}}