AP 10th Exams : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. ఈ విషయాలు తెలుసుకోండి

AP SSC Exams 2026 : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. విద్యార్థులు కింద చెప్పే ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

Published on: Mar 16, 2026 5:56 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో SSC పరీక్షలు 2026 సోమవారం ప్రారంభమై 2026 ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు, 18,842 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.

ఏపీ పదో తరగతి పరీక్షలు
ఏపీ పదో తరగతి పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి దాదాపు 38,958 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. మార్చి 5న హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. దీనిని అధికారిక వెబ్‌సైట్, పాఠశాల లాగిన్‌లు, LEAP యాప్, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అధికారులు 210 సున్నితమైన పరీక్షా కేంద్రాలను గుర్తించారు. వీటిని సీసీటీవీ నిఘాలో ఉంచుతారు. దాదాపు 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను మోహరించనున్నారు. అన్ని కేంద్రాలలో వైద్య బృందాలు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, ఏఎన్ఎం సిబ్బందిని కూడా ఉంచుతారు. తగినంత తాగునీరు, సీటింగ్ ఏర్పాట్లు, వెంటిలేషన్, ఫర్నిచర్‌ను ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశాయి.

పరీక్ష రోజుల్లో విద్యార్థులు హాల్ టికెట్లు చూపించిన తర్వాత ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీలో బస్సు ప్రయాణాన్ని పొందవచ్చు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, పోలీసు శాఖతో సమన్వయంతో శాంతిభద్రతల పర్యవేక్షణ కూడా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ప్రిపరేషన్ సమయంలో మొబైల్ ఫోన్లు, టెలివిజన్, సోషల్ మీడియా వంటివాటికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠినమైన నిబంధనలు అమలు చేస్తారని అధికారులు చెప్పారు. అభ్యర్థులు తమ అసలు హాల్ టికెట్, అవసరమైన స్టేషనరీని తీసుకెళ్లాలి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, పుస్తకాలు, నోట్స్ కచ్చితంగా అనుమతి ఉండదు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌లోని వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. సమాధానాల బుక్‌లెట్‌లను నింపేటప్పుడు ఇన్విజిలేటర్ల సూచనలను పాటించాలని కూడా అధికారులు ఆదేశించారు.

కీలకమైన ఈ పరీక్షల కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు భావోద్వేగ మద్దతు అందించాలి. ఇంట్లో గొడవలు లేకుండా పిల్లలను ప్రశాంతంగా ఉంచాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చవద్దు. వారిని ప్రోత్సహించాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాలి.

‘AP SSC 2026 Exams రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్’

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More