AP Assembly Monsoon Sessions : ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - నోటిఫికేషన్ జారీ

AP Assembly Monsoon Sessions 2026 : ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

Published on: Aug 9, 2026, 15:05:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Assembly Monsoon Sessions 2026 : ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సమావేశాల ప్రారంభ తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.... ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు ఉభయ సభలు సిద్ధమవుతున్నాయి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజే లేదా తొలి రోజు ఉదయాన్నే ఉభయ సభల బీఏసీ సమావేశమవుతుంది. సభ నిర్వహణ… అజెండాను ఈ కమిటీ ఖరారు చేయనుంది. ప్రాథమిక వివరాల ప్రకారం.... ఈ వర్షాకాల సమావేశాలను సుమారు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

కీలక బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చ....

ఈ నాలుగు రోజుల పరిమిత కాలంలోనే రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభ వేదికగా విపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వనుంది. వీటితో పాటు ప్రభుత్వం ప్రతిపాదించిన పలు కీలక బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ నేతలు నిరసనలు చేస్తున్నారు. ప్రతిపక్షం లెవనెత్తుతున్న అంశాలపై... విద్యాశాఖ కూడా క్లారిటీ ఇస్తూ వస్తోంది. అయినప్పటికీ... ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష నేతల ఆరోపణలు, విమర్శలను సీఎం చంద్రబాబుతో సహా మంత్రులందరూ కూడా కొట్టిపారేస్తున్నారు. ఇక భోగాపురం క్రెడిట్ విషయంలోనూ వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరువుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు... ఈసారైనా పాల్గొంటారా..? లేదా అనేది చూడాలి. ఒకవేళ వీరు హాజరైతే... చాలా అంశాలపై వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More