తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే సిట్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కల్తీ జరిగిన మాట వాస్తవమేనని తెలిపింది. అయితే జంతు కొవ్వుల వాడకం అంశాన్ని మాత్రం పేర్కొనలేదు. మరోవైపు ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ జరపాలని జనసేన విజ్ఞప్తి చేసింది.

ఇలాంటి సమయంలో కేబినెట్ సమవేశం కీలక నిర్ణయ తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంలో అసలు సూత్రదారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో సిట్ నివేదికపైనా చర్చ నడిచింది. నివేదికలోని పాత్రధారులపైన చర్యలు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. విచారణలో పలు అంశాల్లో తేడాలు ఉన్నట్టుగా కేబినెట్ గుర్తించింది. సిట్ విచారణ, ఛార్జ్షీట్, ప్రభుత్వానికి సమర్పించిన విషయాలపై అధ్యయనం చేసి వాస్తవాలను సమర్పించేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
సిట్ నివేదికలో నివ్వెరపోయే నిజాలు : మంత్రి పయ్యావుల
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై కేబినెట్ సమావేశంలో ఎక్కువగా చర్చ జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. సిట్ నివేదికలో నివ్వెరపోయే విషయాలు బయటకు వచ్చాయని చెప్పారు. నెయ్యిలో కెమికల్స్, ఇతర ఫ్లేవర్స్ కలిపారని తెలిపారు. వైసీపీ నేతలు కల్తీని సహజం అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలిసి కూడా మౌనంగా ఎందుకు ఉన్నారని తేలాల్సి ఉందన్నారు.
'ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని ముఖ్యమంత్రి మాట్లాడారు. నెయ్యి పరీక్షలో ఎస్ వాల్యూలో తేడా ఉంది. అంటే సస్పెక్టెట్ అడల్టరేషన్ జరిగే అవకాశం ఉంది. సోయాబీన్, కోకోనట్, పామ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, లార్డ్ వంటి అవశేషాలు ఉండే అవకాశం ఉందని వెల్లడైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వెంటనే.. రెండు పోస్టింగుల్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా శ్యామల రావును నియమించారు. అప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 ఆగస్టు 3న బీటా సిటోస్టెరాల్ ఉన్నట్టు రిపోర్టు వచ్చినా.. దాన్ని కొనసాగిస్తూ తప్పును కప్పిపుచ్చారు.' అని మంత్రి పయ్యావుల ఆరోపించారు.
ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్లు కేటాయించారని పూర్తిగా టెండర్ నిబంధనలు ఉల్లంఘించారని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. ఇందులో భాగస్వాములైన అందరినీ నేరస్థులుగానే పరిగణిస్తామన్నారు. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి సహా పలువురు అధికారులు ఉన్నారన్నారు. తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని సిట్ చెప్పిందన్నారు. బాలాజీ, ధర్మారెడ్డి, సింఘాల్ మీద చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసినట్టుగా పయ్యావుల పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినట్టుగా సిట్ పేర్కొందని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్లు కేటాయించారని పూర్తిగా టెండర్ నిబంధనలు ఉల్లంఘించారని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. ఇందులో భాగస్వాములైన అందరినీ నేరస్థులుగానే పరిగణిస్తామన్నారు. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి సహా పలువురు అధికారులు ఉన్నారన్నారు. తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని సిట్ చెప్పిందన్నారు. బాలాజీ, ధర్మారెడ్డి, సింఘాల్ మీద చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసినట్టుగా పయ్యావుల పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినట్టుగా సిట్ పేర్కొందని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}