ఇవాళ శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9.25 నిముషాలకు పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రధాని మోదీతో కలిసి శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. 10 గంటలకు సాయి కుల్వంత్ హాల్లో భగవాన్ శ్రీసత్యసాయి మహా సమాధిని ఇరువురు నేతలు దర్శించుకోనున్నారు.

ఆ తర్వాత శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే శతజయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హాజరు అవుతారు. ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం 1.15 గంటలకు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రికి సీఎం చేరుకోనున్నారు. స్థానికంగా గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి అనంతరం రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.
రైతుల ఖాతాలోకి నిధులు…
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం రెండవ విడతలో రూ.7 వేల చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు రూ.3,135 కోట్లను జమ చేయనుంది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా రూ.7 వేలను ప్రభుత్వం జమ చేసింది. రేపు రెండో విడతగా మరో రూ.7 వేల చొప్పున రైతులకు ప్రభుత్వం జమ చేయనుంది. రెండు విడతల్లో మొత్తంగా రూ.6,309.44 కోట్ల మేర ఆర్ధిక ప్రయోజనం రైతులకు కలుగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక కేడర్ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం రాత్రికి అమరావతికి రానున్నారు.
అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.
{{/usCountry}}అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.
{{/usCountry}}