రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అర్హులైన అభ్యర్థులు తమ నమోదు (రిజిస్ట్రేషన్) తో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు. ఈ నెల 17వ తేదీ వరకు ఇందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా ఈ నెల 23వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

ఈసారి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ - 2026 ప్రవేశ పరీక్షలో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మొత్తం 63,546 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అంటే పరీక్ష రాసిన వారిలో ఏకంగా 89.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు. విద్యార్థులు ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకుల ప్రాతిపదికన వివిధ విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు. అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా ఏవైనా సీట్లు మిగిలి ఉంటే స్పాట్ అడ్మిషన్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి విడుదల చేస్తుంది.
కౌన్సెలింగ్ షెడ్యూల్ - ముఖ్య తేదీలు
- రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు నేటి(ఆగస్ట్ 12, 2026) నుంచి 17వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
- ఆగస్ట్ 13 నుంచి 18వ తేదీ వరకు నియమిత సహాయ కేంద్రాల వద్ద • ధ్రువపత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన ఉంటుంది.
- ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు విద్యార్థులు కోర్సులు, కళాశాలలను వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
- నమోదు చేసిన ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ నెల 20న అవకాశం ఉంటుంది.
- అభ్యర్థుల మెరిట్, కేటగిరీ ఆధారంగా ఈ నెల 23న సీట్లను కేటాయిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/
సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి చేరాల్సి ఉంటుంది. మరోవైపు…. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఈ నెల 24 నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు నిర్దేశిత గడువు లోగా ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
{{/usCountry}}సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి చేరాల్సి ఉంటుంది. మరోవైపు…. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఈ నెల 24 నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు నిర్దేశిత గడువు లోగా ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
{{/usCountry}}