...
...
Next Story

AP EAPCET 2026 : ఏపీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అప్డేట్ - మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు, ఇవిగో వివరాలు

AP EAPCET Online Applications : ఏపీఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Published on: Mar 18, 2026 05:11 AM IST
Advertisement

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అధికారులు తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తు తేదీలను మరోసారి పొడిగించారు, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. మార్చి 17వ తేదీతో(లేట్ ఫీజు లేకుండా) గడువు ముగిసింది. అయితే మరోసారి గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ అయింది.

గడువు పొడిగింపు…

ఏపీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తు అప్డేట్స్ (image source istock)
ఏపీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తు అప్డేట్స్ (image source istock)

తాజాగా దరఖాస్తుల స్వీకణ తేదీల్లో పలు మార్పులు చేశారు. ఫైన్ లేకుండా మార్చి 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించారు.అంతేకాకుండా రూ. 1000 ఫైన్ తో మార్చి 28వ తేదీ వరకు, ఇక రూ. 2 వేల ఫైన్ తో ఏప్రిల్ 1, 4 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 6వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రూ. 10 వేల ఫైన్ తో ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక ఏపీ ఈఏపీసెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఏప్రిల్ 11వ తేదీన అందుబాటులోకి వస్తుందని తాజాగా అధికారులు ప్రకటించారు. ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 13వ తేదీ వరకు సరి చేసుకోవాలని సూచించారు. ఇక పరీక్ష తేదీలు, కీల విడుదల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని… గతంలో ప్రకటించిన తేదీల్లోనే ఉంటాయని స్పష్టం చేశారు.

AP EAPCET 2026 - ముఖ్యమైన తేదీలు

  • ఎంట్రెన్స్ పరీక్ష - ఏపీ ఈఏపీసెట్ - 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ - 24-03-2026.
  • రూ. 1000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 28-03-2026.
  • రూ. 2000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ -01-04-2026.
  • రూ. 4000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 06-04-2026.
  • రూ. 10,000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026 .
  • అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 11-04-2026 నుంచి 13-04-2026.
  • హాల్ టికెట్ డౌన్లోడ్ - 28-04-2026 .
  • ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష - 12-05-2026 నుంచి 15-05-2026 వరకు, మరియు18-05-2026 తేదీల్లో పూర్తవుతాయి.
  • అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు - 19-05-2026 నుంచి 20-05-2026 .
  • అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ విడుదల - 23-05-2026 .
  • అభ్యంతరాల స్వీకరణ - 25-05-2025.
  • ప్రాథమికంగా ఫలితాలు ప్రకటించే తేదీ - 01-06-2026 .
  • అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/EAPCET/

ఏపీ ఈఏపీసెట్ - 2026 నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించారు. ఆ తర్వాత ర్యాంకులను వెల్లడిస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe