Veligonda Project Relief Package : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు, ఆస్తులు, భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కటాఫ్ తేదీ ముగిసినప్పటికీ, అర్హత కలిగిన యువతకు ఎక్స్ గ్రేషియా అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గెజిట్ నోటిఫికేషన్, సోషియో ఎకనామిక్ సర్వేలలో పేర్లు నమోదు కాని అర్హులైన నిర్వాసితులందరికీ సంపూర్ణ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాధారణంగా ప్రాజెక్టు అవార్డు పాస్ కాని వారికి పరిహారం అందడం కష్టం, కానీ అలాంటి యువతకు కూడా ఆర్థిక సాయం అందేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు.
రూ.169 కోట్ల అదనపు సాయం
ముఖ్యమంత్రి ప్రతిపాదించిన మానవతా దృక్పథం ఆధారంగా కటాఫ్ తేదీ తర్వాత కూడా అర్హత పొందిన వారి కోసం ప్రత్యేకంగా రూ.169 కోట్ల ఎక్స్ గ్రేషియా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టుల కోసం త్యాగాలు చేసిన కుటుంబాలను ఆదుకోవడం తమ ప్రాథమిక బాధ్యత అని ప్రభుత్వం పేర్కొంది.
2019 కటాఫ్ తేదీ నుండి 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఈ ఎక్స్ గ్రేషియా అందుతుంది. ఇదివరకే నిర్వాసితులకు అందించిన సాధారణ పరిహారానికి ఇది పూర్తి అదనం. గతంలో పొరపాట్ల వల్ల అవార్డు జాబితాలో నమోదు కాకుండా పోయిన నిర్వాసితులను క్షేత్రస్థాయిలో గుర్తించి, వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 7,027 మంది నిర్వాసిత కుటుంబాలకు రూ.905 కోట్ల విలువైన పునరావాసప్యాకేజీని ప్రభుత్వం అందజేసింది. దీనికి తోడు నిర్వాసిత కుటుంబాల జీవన భద్రత కోసం నెల రోజులకు సరిపడా ఉచిత రేషన్ కిట్ను పంపిణీ చేయాలని కూడా నిర్ణయించారు.
దేశంలో ఏ ఇతర ప్రాజెక్టులోనూ ఇవ్వనంత భద్రత, భరోసాను వెలిగొండ నిర్వాసితులకు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి నిమ్మల తెలిపారు. అర్హుల జాబితాలో తమ పేర్లను చేర్చాలంటూ ప్రభుత్వానికి సుమారు 1,800 గ్రీవెన్సులు, పిటిషన్లు వచ్చాయి. ఈ పిటిషన్లన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన వెంటనే, అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ ఎక్స్ గ్రేషియా చెల్లింపులు ప్రారంభమవుతాయి.
{{/usCountry}}దేశంలో ఏ ఇతర ప్రాజెక్టులోనూ ఇవ్వనంత భద్రత, భరోసాను వెలిగొండ నిర్వాసితులకు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి నిమ్మల తెలిపారు. అర్హుల జాబితాలో తమ పేర్లను చేర్చాలంటూ ప్రభుత్వానికి సుమారు 1,800 గ్రీవెన్సులు, పిటిషన్లు వచ్చాయి. ఈ పిటిషన్లన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన వెంటనే, అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ ఎక్స్ గ్రేషియా చెల్లింపులు ప్రారంభమవుతాయి.
{{/usCountry}}“ఆగస్టు 31వ తేదీ నాటికి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడమే కాకుండా, చివరి నిర్వాసితుడికి పరిహారం అందించి న్యాయం జరిగే వరకు ఈ ప్రక్రియను ఆపబోం. నిర్వాసితులకు ఎక్కడా అన్యాయం జరిగిందనే మాట రాకుండా పారదర్శకంగా వ్యవహరిస్తాం. నిర్వాసిత కాలనీల్లో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలను వేగవంతంగా పూర్తి చేస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.