పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఒక గంట ముందుగా పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రంజాన్ కాలం ఫిబ్రవరి 17వ తేదీన మెుదలవుతుందని చెబుతున్నారు.

ఈ వెసులుబాటు ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న అందరు ముస్లిం ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇందులో ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ సిబ్బంది, ఔట్సోర్సింగ్ సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. ఉపవాస మాసంలో ఉద్యోగులు మతపరమైన ఆచారాలను పాటించడంలో సహాయపడటానికి ఈ వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.
రంజాన్ మాసంలో గంట ముందుగానే వెళ్లేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, ముస్లిం ఉద్యోగులు ప్రార్థనలకు హాజరు కావడానికి పనివేళలు అధికారికంగా ముగిసే గంట ముందు బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
మైనారిటీ సమాజం మతపరమైన భావాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి ఫరూఖ్ కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలనా క్రమశిక్షణను పాటిస్తూనే.. సమాజంలోని అన్ని వర్గాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఉద్యోగులు స్వాగతించారు. పవిత్ర మాసంలో అధికారిక విధులను మతపరమైన ఆచారాలతో సమతుల్యం చేసుకోవడానికి వీలు కల్పించే సహాయక చర్యగా దీనిని భావిస్తారు.
త్వరలోనే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ముస్లిం ఉద్యోగులు కార్యాలయాల నుంచి నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లవచ్చు. అంటే సాయంత్రం 4 గంటలకే విధుల నుండి ఇంటికి వెళ్ళవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ ఉపవాసం సందర్భంగా ఉద్యోగులకు సాయంత్రం వేళల్లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ విందు కోసం ఉపవాసం ఉన్నవారు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటుతో ముస్లింలకు చాలావరకు ఉపశమనం దొరుకుతుంది.
{{/usCountry}}త్వరలోనే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ముస్లిం ఉద్యోగులు కార్యాలయాల నుంచి నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లవచ్చు. అంటే సాయంత్రం 4 గంటలకే విధుల నుండి ఇంటికి వెళ్ళవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ ఉపవాసం సందర్భంగా ఉద్యోగులకు సాయంత్రం వేళల్లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ విందు కోసం ఉపవాసం ఉన్నవారు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటుతో ముస్లింలకు చాలావరకు ఉపశమనం దొరుకుతుంది.
{{/usCountry}}