కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకే దక్కనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూములను ఇప్పించే బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్…. ఈ భూముల విషయంపై సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించి…రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాడు పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అయింది.
తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్….

సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. దీంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1,551 మంది రైతులకు మేలు జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కాకినాడ సెజ్ లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ లకు రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని ఆదేశాలలో పేర్కొన్నారు. ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి.
గతంలో కాకినాడ సెజ్ భూములపై జీవో నెం.12 విడుదల అయినా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మేలు జరగలేదు. వారి పేరున రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో పిల్లలకు పెళ్లిళ్లు, చదువుల నిమిత్తం భూములు ఉపయోగపడటం లేదని రైతులు పవన్ కళ్యాణ్ కు గతంలో నివేదించారు. దీనిపై పూర్తి వివరాలు పరిశీలించి, రైతులకు మేలు జరిగేలా చూస్తానని జనసేన అధినేతగా అప్పట్లో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
ఈ సమస్యను ఇటీవల శాసనమండలిలో సమావేశాల్లో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించారు. భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ కాకపోవడంతో రైతు భరోసా వంటి పథకాల లబ్ధి అందడం లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికీ వీలు లేకుండా పోయిందన్నారు.
{{/usCountry}}ఈ సమస్యను ఇటీవల శాసనమండలిలో సమావేశాల్లో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించారు. భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ కాకపోవడంతో రైతు భరోసా వంటి పథకాల లబ్ధి అందడం లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికీ వీలు లేకుండా పోయిందన్నారు.
{{/usCountry}}ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాకినాడ సెజ్ రైతులకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతుల భూములు రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రెవెన్యూశాఖ మంత్రి అనగానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.