హరి హర వీరమల్లు నిర్మాతకు కీలక పదవి.. నగ్నంగా ఉన్నట్టుంది.. జీవితంలో ఇదే తొలిసారి.. పవన్ కల్యాణ్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హరి హర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నంకు కీలక పదవిని ప్రతిపాదించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఇవాళ నిర్వహించిన హరి హర వీరమల్లు ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. .

Published on: Jul 21, 2025 3:57 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. తాజాగా ఇవాళ (జూలై 21) హరి హర వీరమల్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హరి హర వీరమల్లు నిర్మాతకు కీలక పదవి.. నగ్నంగా ఉన్నట్టుంది.. జీవితంలో ఇదే తొలిసారి.. పవన్ కల్యాణ్ కామెంట్స్
హరి హర వీరమల్లు నిర్మాతకు కీలక పదవి.. నగ్నంగా ఉన్నట్టుంది.. జీవితంలో ఇదే తొలిసారి.. పవన్ కల్యాణ్ కామెంట్స్

ఇంట్రాక్షన్ కోసం

పవన్ కల్యాణ్‌కు మైక్ ఇచ్చి మాట్లాడాల్సిందిగా యాంకర్ సుమకోరారు. మైక్ చేతిలోకి తీసుకున్న పవన్ కల్యాణ్ "పోడియం లేకుండా మాట్లాడటం ఇబ్బందిగా ఉంది. ఎలా ఉందంటే నగ్నంగా ఉన్నట్లు ఉంది పోడియం లేకపోయేసరికి. దయచేసి మీరందరు తీసుకురండి. ఇంట్రాక్షన్ కోసం. జీవితంలో మొదటిసారి ఇది. పొలిటికల్ ఇంట్రాక్షన్ చేశాను కానీ, సినిమా పరంగా ఆలోచించలేదు" అని అన్నారు.

"ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. హైదరాబాద్ సుల్తాన్‌ల దగ్గరకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది? ఈ నేపథ్యంలో జరిగే కథ ఉంది. దీనికి పునాది వేసింది క్రిష్ జాగర్లమూడి గారు. ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చారు. ఆయన, రత్నం గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే ఓకే చేశాను" అని పవన్ కల్యాణ్ తెలిపారు.

కరోనా ప్రభావం చూపించింది

"అయితే కరోనా అనేది సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది. నేను ఏఎం రత్నం గారిని దగ్గర నుండి చూశాను. ఒకప్పుడు ఆయన వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, దర్శకులు తిరిగేవారు. ఖుషి సినిమా సమయంలో మాకు ఒక నెల ముందే ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. మాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నలిగిపోతుంటే నాకు బాధేసింది" అని పవన్ కల్యాణ్ చెప్పారు.

"ఇది డబ్బు గురించో, విజయం గురించో కాదు.. మన వాళ్ల కోసం, సినీ పరిశ్రమ కోసం నమ్మి నిలబడటం. కొన్ని కారణాల వల్ల క్రిష్ గారు ఈ సినిమా పూర్తి చేయలేకపోయినప్పటికీ.. ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

నా నిర్మాత అని కాదు

నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు పరిశ్రమకు అండగా ఉన్న నిర్మాత రత్నం గారికి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రత్నం గారి పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను ప్రతిపాదించాను. నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను" అని ఏఎం రత్నంకు కీలక పదవి ప్రతిపాదించడంపై పవన్ కల్యాణ్ మాట్లాడారు.

"థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఓ మంచి అనుభూతిని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సినిమా అనేది మా జీవితంలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపించాలి. అలాంటి ప్రభావాన్ని, ఎనర్జీని ఇచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ తన స్పీచ్ ముగించారు.