ఏపీ టెన్త్ పరీక్షలు ముగిశాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం కోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15వ తేదీతో ముగుస్తుంది. ఈ మేరకు కార్యాచరణను ఫైనల్ చేశారు.

ఇక పదో తరగతి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో…. పలు ప్రశ్నలపై ప్రభుత్వ పరీక్షల విభాగానికి అభ్యంతరాలు అందాయి. హిందీ పేపర్లో ప్రశ్నలు 3, 6 బిట్లలో కింద ఇచ్చిన ఐచ్ఛికాల్లో అక్షర దోషాలున్నట్లు రాగా… ఇంగ్లీష్ ఎగ్జామ్ విషయంలో మరో అభ్యంతరం వ్యక్తమైంది. క్వశ్చన్ పేపర్ లో 28వ ప్రశ్న(4 మార్కులు) పాఠ్యపుస్తకం నుంచి కాకుండా వర్క్బుక్ నుంచి ఇచ్చినట్లు పరీక్షల విభాగం దృష్టికి వచ్చింది. ఈ ఫిర్యాదులను సబ్జెక్టు నిపుణుల కమిటీకి పంపారు. పరిశీలిన తర్వాత…. ఆయా ప్రశ్నలకు మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది.
అటెంప్ట్ చేస్తే 6 మార్కులు…
సబ్జెక్ట్ నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాత…. హిందీ సబ్జెక్టుకు రెండు మార్కులు కలుపుతారు. ఇక ఇంగ్లీష్ సబ్జెక్టుకు 4 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. అయితే విద్యార్థులు ఆయా ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉండాలని…. జవాబు తప్పైనా మార్కులు ఇస్తారు. అటెంప్ట్ చేసిన వాళ్లకే ఈ మార్కులు కలుస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
AP SSC 2026 ఫలితాలు ఎప్పుడు..?
గతేడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కానుంది. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి వారానికి పైగా సమయం పటొచ్చు. ఇది కూడా పూర్తి కాగానే ఈనెల 25వ తేదీ తర్వాత ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే… నెలాఖారులోపే ఫలితాలను ప్రకటించవచ్చు.
ఏపీ టెన్త్ ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్(9552300009) లో కూడా అందుబాటులో ఉంటాయి.
{{/usCountry}}ఏపీ టెన్త్ ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్(9552300009) లో కూడా అందుబాటులో ఉంటాయి.
{{/usCountry}}