గోదావరి ప్రాంతంలోని పుష్కర ఘాట్ల వద్ద 162 ఆలయాల పునరుద్ధరణ

గోదావరి పుష్కరాలు 2027 కోసం ప్రభుత్వం పనులు మెుదలుపెట్టింది. ఇందులో భాగంగా 162 ఆలయాల పునరుద్ధరణ చేయాలని అధికారులు నిర్ణయించారు.

Published on: Jun 21, 2026, 14:29:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుటి నుంచే పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పుష్కర ఘాట్ల సమీపంలో ఉన్న 162 దేవాలయాలను పునరుద్ధరించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.

గోదావరి పుష్కరాలు
గోదావరి పుష్కరాలు

మౌలిక వసతుల కల్పన

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి రాహుల్ మీనాతో కలిసి కమిషనర్ రామచంద్రమోహన్ ప్రతిపాదిత మౌలిక సదుపాయాలు, ఆలయాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. పుష్కరాల కోసం వచ్చే కోట్లాది మంది భక్తులు ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం సమీపంలోని ఆలయాలను దర్శించుకుంటారని, అందుకే ఈ ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

'గోదావరి ప్రాంతంలోని పుష్కర ఘాట్లకు సమీపంలో మొత్తం 543 దేవాలయాలను గుర్తించాం. వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 162 ఆలయాలను మొదటి విడతలో ఆధునీకరించి, మరిన్ని అదనపు వసతులు కల్పించనున్నాం.' అని రామచంద్రమోహన్ పేర్కొన్నారు.

మార్చి 2027 నాటికి పనుల పూర్తి

ఈ 162 ఆలయాల పునరుద్ధరణ పనులకు ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. రాబోయే ఏడాది మార్చి నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీటిలో 43 ఆలయాలకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కమిషనర్ తెలిపారు.

ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్

పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని నియంత్రించడం అతిపెద్ద సవాల్. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, రెవెన్యూ మరియు పోలీస్ విభాగాల మధ్య గట్టి సమన్వయం ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రత్యేక అధికారి రాహుల్ మీనా సూచించారు.

ఘాట్ల ఆధునీకరణలో భాగంగా ఘాట్ల వద్ద పారిశుధ్యం, తాగునీరు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదుల ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, క్యూ లైన్ల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళికలు చేశారు. సీసీటీవీ నిఘా, అదనపు పోలీస్ బలగాల మోహరిస్తారు. పుష్కరాల నాటికి ఘాట్లు, ఆలయాల రూపురేఖలు మార్చి, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More