అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం చేసింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత కేంద్ర విభాగాలు కోరిన అవసరమైన వివరాలు, స్పష్టతలను సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఈ సంబంధిత బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చూస్తోంది.

ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక పార్లమెంటు సభ్యుడి ప్రకారం.. జనవరి 28న ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముగింపు నాటికి ఈ ప్రతిపాదిత చట్టం ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఈ బిల్లు 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడానికి ఉద్దేశించబడింది. ఆ చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. ఈ గడువు జూన్ 2, 2024న ముగిసింది. ఈ నేపథ్యంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా ప్రకటించడం అవసరమైంది.
రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం అమరావతికి చట్టపరమైన రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరింది. హోం, న్యాయ మంత్రిత్వ శాఖలకు అవసరమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయడం, నిర్మాణాల పురోగతికి సంబంధించిన వాస్తవాలతో కూడిన ఒక నివేదికను సిద్ధం చేసి, బిల్లును ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా కేంద్రానికి పంపింది. జూన్ 2, 2024 నుండి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కూడా కోరింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టపరమైన బలాన్ని చేకూర్చడానికి, తద్వారా కేంద్ర చట్టం కింద దానికి రక్షణ లభించేలా చేయడానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాల్సిన అవసరం ఉందని సంకీర్ణ ప్రభుత్వం భావించింది.
{{/usCountry}}పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టపరమైన బలాన్ని చేకూర్చడానికి, తద్వారా కేంద్ర చట్టం కింద దానికి రక్షణ లభించేలా చేయడానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాల్సిన అవసరం ఉందని సంకీర్ణ ప్రభుత్వం భావించింది.
{{/usCountry}}అధికారంలోకి వచ్చిన వెంటనే, టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండేలా, భవిష్యత్తులో ఎవరూ దానిని మార్చకుండా ఉండేలా పార్లమెంటు ఆమోదం పొందాలని సంకల్పించాయి. నిజానికి 2016 నుంచి రాజధానిగా అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మూడు రాజధానులు అంశాన్ని ఎత్తుకున్నారు. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చింది. వీలైనంత త్వరగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చూస్తోంది.