రాబోయే జూన్ 21న దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET 2026) జరగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సకాలంలో తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. పరీక్షకు వెళ్లే అభ్యర్థులు కండక్టర్కు తమ నీట్ హాల్ టికెట్ (NEET Hall Ticket) చూపిస్తే చాలు, రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు.

విద్యార్థుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాలకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థుల అవసరాల దృష్ట్యా ఎక్కడా రవాణా కొరత లేకుండా రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు ఆర్టీసీ సర్వీసులను నడపాలన్నారు.
పరీక్ష ప్రారంభ సమయానికి ముందే విద్యార్థులు సురక్షితంగా సెంటర్లకు చేరుకునేలా బస్సుల టైమింగ్స్ నిర్వహించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
సాధారణంగా నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల కోసం విద్యార్థులు తమ సొంత ఊర్ల నుండి సుదూర ప్రాంతాల్లో ఉన్న సెంటర్లకు ప్రయాణించాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తోడుగా వెళ్తుంటారు. ప్రయాణ ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో, ఏపీ ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయం పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అభిప్రాయపడ్డారు.
'రాష్ట్రంలోని నీట్ అభ్యర్థులందరూ ప్రభుత్వం కల్పించిన ఈ ఉచిత రవాణా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాసి విజయం సాధించాలి.' అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
{{/usCountry}}'రాష్ట్రంలోని నీట్ అభ్యర్థులందరూ ప్రభుత్వం కల్పించిన ఈ ఉచిత రవాణా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాసి విజయం సాధించాలి.' అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
{{/usCountry}}ఎంతో కష్టపడి ఈ పరీక్షకు సిద్ధమైన విద్యార్థులందరికీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి విద్యార్థులు జూన్ 21న జరిగే నీట్ పరీక్షకు వెళ్లే సమయంలో తమ హాల్ టికెట్లను చూపించి ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా అధికారులు కోరారు.