అంగన్‌వాడీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్.. 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవ్వనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 5జీ స్మార్ట్‌ఫోన్లను వారికి అందించనుంది. తద్వారా సమాచాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోనుంది.

Published on: Dec 11, 2025 7:24 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు సేవలను మెరుగుపరచడానికి ఏపీ ప్రభుత్వం రూ.75 కోట్ల వ్యయంతో 58,204 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జీ స్మార్ట్ మొబైల్ ఫోన్‌లను పంపిణీ చేయనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి ప్రకటించారు. కార్మికులు, సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, గత ప్రభుత్వం సరఫరా చేసిన 4జీ ఫోన్‌లు సరిగ్గా పనిచేయడం లేదని, ఇది క్షేత్రస్థాయి నివేదిక, పథకాల అమలును ప్రభావితం చేస్తుందని అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ అంతటా 55,204 అంగన్‌వాడీ కేంద్రాలలో సుమారు 1.25 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, అప్‌గ్రేడ్ చేసిన పరికరాలు డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా పొందడంలో వారికి సహాయపడతాయని మంత్రి అన్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ సేవలందించడంలో జాతీయ స్థాయిలో A++ ర్యాంక్, నాల్గవ స్థానాన్ని సాధించిందని మంత్రి సంధ్యా రాణి చెప్పారు. 100 శాతం ఫలితాలను సాధించడానికి నిబద్ధతతో పనిచేయడం కొనసాగించాలని సిబ్బందిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు సంక్షేమ పథకాలకు అర్హతను విస్తరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆమె అన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలకు సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌ఫోన్లను ఏపీటీఎస్ ద్వారా కొనుగోలు చేసారు. ఒక్కో మెుబైల్ ధర రూ.12,500 వరకు ఉంటుంది. ఈ మెుబైల్స్ ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలు తమ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు, ప్రభుత్వ స్కీమ్ వారికి చేరవేసేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడనున్నాయి. దీంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి.

సేవల డిజిటలైజేషన్‌‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల రియల్ డేటా నమోదు చేయాలి. దీనితో పోషణ కార్యక్రమాల పర్యవేక్షణ వేగవంతం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా డేటా అందుబాటులోకి వస్తుందని, పనితీరులో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారభించింది. జిల్లాలకు దశలవారీగా స్మార్ట్ ఫోన్లు చేరుకుని అంగన్‌వాడీ కార్యకర్తలు పంపిణీ చేయనున్నారు. అవసరమైన యాప్స్ ఇన్‌స్టాలేషన్ కూడా చేస్తారు.