ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) ప్రతిభావంతులైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పించింది. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ తమ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoEs) కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సులతో పాటు ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) ఉచిత శిక్షణలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారులు సమాచారాన్ని వెల్లడించారు.

విశాఖపట్నంలోని మేఘాద్రిగెడ్డ, గుంటూరు జిల్లాలోని అమరావతి-తాడికొండ, అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కోట ప్రాంతాల్లో ఉన్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఈ అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (జూనియర్ ఇంటర్), రెండో సంవత్సరం (సీనియర్ ఇంటర్) MPC, BiPCలో అడ్మిషన్స్ ఉన్నాయి.
మొదటి సంవత్సరంలో మార్చి 2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కనీసం 85 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
రెండో సంవత్సరం కోసం మార్చి 2026 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో(ఎంపీసీ/బైపీసీ) 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఇతర జూనియర్ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు కూడా ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఇంటర్ విద్యతో పాటు ఉచితంగా ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ ఇస్తారు.
కార్పొరేట్ స్థాయిలో ఉచిత హాస్టల్ సదుపాయం ఉంటుంది. ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తారు. ఉచితంగా ప్రామాణికమైన పుస్తకాలు, పరీక్షల మెటీరియల్ ఇస్తారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొత్తం సీట్లలో 75 శాతం సీట్లు షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు కేటాయించగా, మిగిలిన 25 శాతం సీట్లను ఓసీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు కేటాయించారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారిక అడ్మిషన్ల పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
{{/usCountry}}ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొత్తం సీట్లలో 75 శాతం సీట్లు షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు కేటాయించగా, మిగిలిన 25 శాతం సీట్లను ఓసీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు కేటాయించారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారిక అడ్మిషన్ల పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
{{/usCountry}}ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు
జూలై 17 నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 30 వరకు దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం ఉంది. విద్యార్థులు ఈ సెంటర్లలో కార్పొరేట్ విద్యను పొందవచ్చు. జేఈఈ, నీట్లపై ఫోకస్ చేసే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.