AP Weather Alert : ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పుల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు అకాల వర్షాలు, పిడుగుల ముప్పు పొంచి ఉంది. ఈ రెండు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా హెచ్చరించింది.

ఈ వేసవి సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత నెల్లూరు జిల్లా గూడూరులో నమోదైంది. గురువారం ఇక్కడ ఉష్ణోగ్రత 45.8 డిగ్రీల మార్కును తాకింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. దాదాపు 216 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మండుతున్న ఎండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇవాళ రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇందులో పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయి.
ద్రోణి ప్రభావం…పిడుగులతో కూడిన వర్షాలు
ఎండలు ఒకవైపు దంచికొడుతుంటే… వాతావరణంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
పొలాల్లో పనులు చేసే రైతులు, కూలీలు వాతావరణం మారినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. "ఆకాశం మేఘావృతమై వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు లేదా ఉరుములు వినిపించినప్పుడు రైతులు, కూలీలు పొలాల్లోని చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు" అని స్పష్టం చేస్తోంది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండటం అత్యంత ప్రమాదకరమని, సురక్షితమైన కట్టడాల లోపలికి వెళ్లాలని పేర్కొంది. పశువుల కాపరులు కూడా తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}పొలాల్లో పనులు చేసే రైతులు, కూలీలు వాతావరణం మారినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. "ఆకాశం మేఘావృతమై వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు లేదా ఉరుములు వినిపించినప్పుడు రైతులు, కూలీలు పొలాల్లోని చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు" అని స్పష్టం చేస్తోంది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండటం అత్యంత ప్రమాదకరమని, సురక్షితమైన కట్టడాల లోపలికి వెళ్లాలని పేర్కొంది. పశువుల కాపరులు కూడా తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో….. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలని కోరారు.