ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. 2023 గ్రూప్-2 నోటిఫికేషన్లో పేర్కొన్న రిజర్వేషన్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్ను రద్దు చేస్తూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ అనేక మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం గ్రూప్-2 నోటిఫికేషన్ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషన్లను తిరస్కరించింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న పిటిషనర్ల వాదనలను పక్కన పెట్టింది. దీనితో గ్రూప్ 2 అభ్యర్థులకు ఉపశమనం లభించింది.
ఏపీపీఎస్సీ 905 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. ఏప్రిల్లో ఫలితాలను విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాతో కలిపి మెుత్తం 2517 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి ధ్రువపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియపరచనున్నట్టుగా అధికారులు చెప్పారు.
అయితే గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశం హైకోర్టులో ఉండటంతో తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టుగా ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతోపాటుగా మెయిన్ పరీక్ష ఫైనల్ కీని కూడా అధికారులు వెబ్సైట్లో పెట్టారు.
ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనైనా ఏదైనా కారణం చేత అభ్యర్థి అర్హులు కాదని తేలితే.. వారిని అనర్హులుగా ప్రకటించే హక్కు కమిషన్కు ఉంది. నియామక ప్రకటనకు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న వివిధ కేసుల తీర్పులకు లోబడి తుది ఫలితాల ప్రకటన ఉంటుందని గతంలోనే కమిషన్ వెల్లడించింది. అయితే అభ్యంతరాలతో దాఖలైన పిటిషన్లను హైకోర్టు తాజాగా కోట్టివేసింది. త్వరలో తుది ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసే అవకాశం ఉంది.
{{/usCountry}}ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనైనా ఏదైనా కారణం చేత అభ్యర్థి అర్హులు కాదని తేలితే.. వారిని అనర్హులుగా ప్రకటించే హక్కు కమిషన్కు ఉంది. నియామక ప్రకటనకు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న వివిధ కేసుల తీర్పులకు లోబడి తుది ఫలితాల ప్రకటన ఉంటుందని గతంలోనే కమిషన్ వెల్లడించింది. అయితే అభ్యంతరాలతో దాఖలైన పిటిషన్లను హైకోర్టు తాజాగా కోట్టివేసింది. త్వరలో తుది ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసే అవకాశం ఉంది.
{{/usCountry}}ఈ లింక్ క్లిక్ చేసి గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు చూడండి.