గణేష్ మండపాల అనుమతుల కోసం ఆన్లైన్ సింగిల్ విండో సిస్టమ్.. ఎన్ఓసీ డౌన్లోడ్ చేసుకోండి
గణేష్ చతుర్థి వేడుకల కోసం అనుమతులు పొందాలని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము లేకుండా అనుమతులు జారీ చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రారంభించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.ప్రక్రియను సులభతరం చేయడం, ఏకరీతి ప్రమాణాలను కొనసాగించడం, వివిధ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం, పండుగను శాంతియుతంగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీజీపీ ఒక ప్రకటనలో వెల్లండిచారు.

గణేష్ ఉత్సవ్ కమిటీలు, మండపాల నిర్వాహకులు www.ganeshutsav.netకు లాగిన్ చేసి, ప్రతిపాదిత మండపం, ప్రదేశానికి సంబంధించిన అవసరమైన వివరాలను సమర్పించవచ్చు. అప్లికేషన్ పరిశీలన, జాయింట్ వెరిఫికేషన్ కోసం పోలీసు, అగ్నిమాపక, మున్సిపాలిటీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులకు పంపిస్తారు. పరిశీలన పూర్తయిన తర్వాత, QR- కోడ్ ఆధారిత డిజిటల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ అవుతుంది.
గణేష్ ఉత్సవ్ కమిటీలు, నిర్వాహకులు ఆన్లైన్ సింగిల్ విండో సిస్టమ్ను ఉపయోగించాలని, వెరిఫికేషన్ కోసం మండపం వద్ద QR- కోడ్ను ప్రదర్శించాలని డీజీపీ కోరారు. గణేష్ ఉత్సవాలు సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అధికారులకు సహకరించాలన్నారు.
మరోవైపు రాబోయే గణేష్ చతుర్థి వేడుకల కోసం సింగిల్-విండో విధానం ద్వారా అనుమతులు పొందేందుకు నెల్లూరు నగరంలోని తాత్కాలిక గణేష్ మండపాల నిర్వాహకులు తమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కోరింది. బుధవారం స్థానిక హోటల్లో మండప నిర్వాహకుల సమావేశం జరిగింది.
గణేష్ ఉత్సవ నిర్వాహకులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వేడుకలు, నిమజ్జన ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు ఈ సమితిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పెన్నా ఘాట్, నెల్లూరు చెరువు గణేష్ ఘాట్ వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు చెప్పారు. శివాజీ సెంటర్, ట్రంక్ రోడ్లోని టీవీఎస్ కళ్యాణ సదన్లో ఉన్న సమితి కార్యాలయం సెప్టెంబర్ 5న తెరుచుకుంటుంది. అనుమతుల కోసం మండప నిర్వాహకులు అక్కడ నమోదు చేసుకోవాలని కోరారు. ఇక్కడ ఐదు రోజుల ఉత్సవాలు సెప్టెంబర్ 14న ప్రారంభమవుతాయి. అనంతరం సెప్టెంబర్ 18న నిర్దేశిత ఘాట్ల వరకు ఊరేగింపు, విగ్రహాల నిమజ్జనం జరుగుతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


