ఆంధ్రప్రదేశ్లోని 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు. అయితే దరఖాస్తుల గడువు దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు…. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సమయం దగ్గరపడిన నేపథ్యంలో… ఆలస్యం చేయకుండా వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు,టీచర్లు సూచిస్తున్నారు.

దరఖాస్తు చేసుకునే విద్యార్థి…. సంబంధిత జిల్లాలల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలల్లో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలలో చదివి ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి. ఓసీ, బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2014-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2012-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష అప్లికేషన్ ఫీజు కింద ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 చెల్లించాలి.
ఏప్రిల్ 12న ఎంట్రెన్స్ ఎగ్జామ్…..
ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు పనిచేస్తున్నాయో.. ఆ పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు /ఇంగ్లీషు మీడియాల్లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం ఇలా….
- ముందుగా https://apms.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- వివరాల నమోదు తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.
రాత పరీక్షలో చూపే ప్రతిభ ఆధారంగానే సీటు ఖరారవుతుంది. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, గణితం, సోషల్, సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై ఉంటుంది.
{{/usCountry}}రాత పరీక్షలో చూపే ప్రతిభ ఆధారంగానే సీటు ఖరారవుతుంది. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, గణితం, సోషల్, సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై ఉంటుంది.
{{/usCountry}}