AP POLYCET 2026 Results : ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'ఏపీ పాలిసెట్-2026' (AP POLYCET) ఫలితాల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. మే 5వ తేదీ మధ్యాహ్నం ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే వేలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు కేంద్రాల్లో పాలిసెట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. పరీక్ష జరిగిన రెండు రోజులకే, అంటే ఏప్రిల్ 27న ప్రాథమిక కీ (Preliminary Key) విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఇప్పుడు తుది కీతో పాటు ఫలితాలను కూడా ఒకేసారి విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు పూర్తి చేసింది.
ఏపీ పాలిసెట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
- ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ polycetap.nic.in లేదా polycetap.ap.gov.in సందర్శించండి.
- హోం పేజీలో కనిపించే 'ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు లింక్పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ను నమోదు చేయండి.
- వివరాలు సరిచూసుకుని సబ్మిట్ బటన్ నొక్కండి.
- మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డును ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
ఇక ఏపీ పాలిసెట్ ఫలితాలు మనమిత్ర వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా క్షణాల్లోనే మీ ర్యాంక్ కార్డును చెక్ చేసుకోవచ్చు.
- మీ మొబైల్లో 'మన మిత్ర' అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
- వాట్సాప్ ఓపెన్ చేసి…. ఆ నంబర్కు "Hi" అని మెసేజ్ పంపండి.
- వెంటనే మీకు వచ్చే ఆప్షన్లలో "ఎడ్యుకేషన్ సర్వీసెస్" ఎంచుకోండి.
- ఆ తర్వాత "ఏపీ పాలిసెట్ ఫలితాలు 2026" పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే, మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది..
ఏపీ పాలిసెట్ పరీక్షలో మొత్తం 120 మార్కులకు గాను కనీసం 25 శాతం మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. అంటే…. జనరల్ కేటగిరీ విద్యార్థులు కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ఎలాంటి కనీస మార్కుల నిబంధన లేదు. వారు కేవలం పరీక్షకు హాజరైతే సరిపోతుంది. కానీ వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకును కేటాయిస్తారు.
{{/usCountry}}ఏపీ పాలిసెట్ పరీక్షలో మొత్తం 120 మార్కులకు గాను కనీసం 25 శాతం మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. అంటే…. జనరల్ కేటగిరీ విద్యార్థులు కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ఎలాంటి కనీస మార్కుల నిబంధన లేదు. వారు కేవలం పరీక్షకు హాజరైతే సరిపోతుంది. కానీ వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకును కేటాయిస్తారు.
{{/usCountry}}ఫలితాలు విడుదలైన తర్వాత జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ఈ ర్యాంకుల ఆధారంగానే జరుగుతుంది.