పేద విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్తను చెప్పింది. విద్యా హక్కు చట్టం(RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

{{^htLoading}} {{/htLoading}}
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ కోటా కింద సీట్ల కల్పిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఆయా విద్యార్థులు మొదటి తరగతిలో ఉచితంగా ప్రవేశం పొందవచ్చు.
మొత్తం కేటాయించిన(25 శాతం ) సీట్లలో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఉంటాయి. ఎస్సీ విద్యార్థులకు 10 శాతం, ఎస్టీ 4 శాతం,.. బీసీ, మైనారిటీలు, ఇతరులకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు. ఇక అనాథలు, దివ్యాంగులు, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించారు.
అర్హతలు - ముఖ్యమైన వివరాలు…
- ఈ కోటా కింద దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని అర్హతలు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థి వయసు జూన్ 1, 2026 నాటికి కనీసం 5 ఏళ్లు నిండి ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి వార్షిక ఆదాయం రూ.1.20 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల లోపు ఉండాలి.
- సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సిలబస్ ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 2, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి. 5 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
- స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న స్కూళ్లలో ప్రవేశం కోసం జూన్ 2, 2020 నుంచి మే 31, 2021 మధ్య జన్మించి 5 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం….
- ఈనెల 20వ తేదీన నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
- అర్హులైన అభ్యర్థులు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యా వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు.
- మీ సేవా కేంద్రాల్లో ద్వారా కూడా దరఖాస్తు ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
- దరఖాస్తకు చివరి తేదీ - 10 మార్చి 2026.
- ఈ అడ్మిషన్లకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 18004258599 టోల్ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ టోల్ ఫ్రీ నెంబర్ సేవలు అందుబాటులో ఉంటాయి.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}