ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉండి.. ఇంకా టెట్(TET) అర్హత సాధించని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Special TET) నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయులకు పెద్ద ఉపశమనం దొరుకుతుంది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి. 2011 కంటే ముందు ఉద్యోగాల్లో చేరి, ఐదేళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 లోపు కచ్చితంగా టెట్ అర్హత సాధించాలి. ఒకవేళ ఈ గడువులోగా అర్హత సాధించకపోతే వారి సర్వీసుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటంతో విద్యాశాఖ ఈ ప్రత్యేక పరీక్షకు ఏర్పాట్లు చేస్తోంది.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని, లేదా వారి కోసం ప్రత్యేకంగా ఒక పరీక్షను నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. రెగ్యులర్ అభ్యర్థులతోపాటుగా కాకుండా.. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం విడిగా స్పెషల్ టెట్ పెట్టాలనే వారి డిమాండ్కు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, విద్యాశాఖ రెండు రకాల పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతోంది. రెగ్యులర్ టెట్ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూసే కొత్త అభ్యర్థుల కోసం యథావిధిగా జరుగుతుంది. ప్రత్యేక టెట్ ప్రస్తుతం సర్వీసులో ఉండి, నిబంధనల ప్రకారం అర్హత సాధించాల్సిన సీనియర్ ఉపాధ్యాయుల కోసం మాత్రమే దీనిని నిర్వహిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో టెట్ పరీక్ష నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇటీవల సాధారణ టెట్ నోటిఫికేషన్కు సుమారు 74 వేల మంది ఇన్సర్వీస్ టీచర్లు అప్లై చేశారు.
ఇక రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్ ఇప్పటికై విడుదలైన విషయం తెలిసిందే. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాల పరిశీలన పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 15వ తేదీన తుది ఫలితాలు విడుదల అవుతాయి. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in లో పొందుపరిచారు. ఈ సాధారణ టెట్లో అర్హత సాధించని ప్రభుత్వ ఉపాధ్యాయులు స్పెషల్ టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
{{/usCountry}}ఇక రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్ ఇప్పటికై విడుదలైన విషయం తెలిసిందే. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాల పరిశీలన పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 15వ తేదీన తుది ఫలితాలు విడుదల అవుతాయి. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in లో పొందుపరిచారు. ఈ సాధారణ టెట్లో అర్హత సాధించని ప్రభుత్వ ఉపాధ్యాయులు స్పెషల్ టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
{{/usCountry}}