ఏపీ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - ఈనెల 10 నుంచి పరీక్షలు ప్రారంభం
ఈనెల 10వ తేదీ నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈసారి జరగబోయే టెట్కు మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతారు.
ఏపీ టెట్ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా… రేపోమాపో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిరోజూ 2 సెషన్లలో ఎగ్జామ్స్ జరుగుతాయి.

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ వివరాల ప్రకారం…. ఉదయం 9.30 గంటల నుంచి 12గంటలు ఒక సెషన్ ఉండగా.., మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. .మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతిదీ కూడా ఒక మార్కును కలిగి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
జనవరిలో ఫలితాలు…
ఈసారి జరిగే టెట్ పరీక్ష కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. జనవరి 2వ తేదీన ప్రాథమిక కీలు విడుదలవుతాయి.జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 13వ తేదీన ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన తుది ఫలితాలను ప్రకటిస్తారు.
టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. కాబట్టి టెట్ లో మంచి స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందులో సాధించే స్కోర్… డీఎస్సీలో వెయిటేజీగా తీసుకుంటారు.
మరోవైపు ఏపీ టెట్ కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఆన్లైన్ మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ ఈ అవకాశాన్ని కల్పించింది.
మాక్ టెస్టులు ఇలా రాసుకోవచ్చు…
- ఏపీ టెట్ అభ్యర్థులు ముందుగా https://tet2dsc.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని మాక్ టెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మొత్తం 13 సబ్జెక్టుల పేర్లు కనిపిస్తాయి. మీకు అప్లయ్ చేసిన సబ్జెక్ట్ పక్కన ఉండే లింక్ పై క్లిక్ చేయాలి.
- ఎలాంటి పాస్వర్డ్ లేకుండా సైన్-ఇన్ అవడం ద్వారా ఉచిత మాక్ టెస్టులను ఉపయోగించుకోవచ్చు.
- ఈ పరీక్షలను రాయటం ద్వారా పరీక్షా విధానంతో పాటు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఓ అవగాహనకు రావొచ్చు.
ఏపీ టెట్ పరీక్షలు డిసెంబర్ 10, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ప్రతి రోజూ 2 సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది
ఏపీ టెట్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నంబర్లను (8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286, 6281704160) సంప్రదించవచ్చు.













