Water Games : చీరాల రామపురం బీచ్లో పారామోటర్ ఎయిర్ సఫారీ, జెట్ స్కీ లాంచ్
Chirala Beach : బాపట్ల తీరప్రాంతంలో ఉన్న అవకాశాలను వినియోగించుకుని జిల్లాను ప్రముఖ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. బాపట్లలో పారామోటర్ ఎయిర్ సఫారీ, జెట్ స్కీ లాంచ్ చేశారు.
సాహస పర్యాటకాన్ని పర్యవేక్షించడానికి, సందర్శకుల భద్రతను నిర్ధారించడానికి బాపట్ల జిల్లా యంత్రాంగం జిల్లా స్థాయి భద్రతా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ సాహస పర్యాటక మార్గదర్శకాలు, 2025 కింద జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ సాహస జోన్లను గుర్తించడం, నిరభ్యంతర పత్రాలను(NOCలు) మంజూరు చేయడం, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడం, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం వంటివి చేస్తుంది. ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది.

బాపట్ల జిల్లా చీరాల మండలంలోని రామపురం బీచ్లో సాహస పర్యాటక కార్యకలాపాలను ప్రారంభించిన సందర్భంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సమాచార, పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖ, పర్యాటక శాఖ ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) చైర్మన్ నుకసాని బాలాజీ, కలెక్టర్, చీరాల ఎమ్మెల్యే ఎం. మలకొండయ్యలతో కలిసి “డైవ్ చీరాల” కార్యక్రమంలో భాగంగా పారామోటార్ ఎయిర్ సఫారీ, జెట్ స్కీ రైడ్లను ప్రారంభించారు.
పర్యాటకుల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగినదని, స్థానిక నివాసితుల సహకారాన్ని కోరుతున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. చీరాల, సూర్యలంక బీచ్లు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, పర్యాటకం యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన తెలిపారు.
సూర్యలంక బీచ్లో స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.97.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఏపీటీడీసీ ఛైర్మన్ శ్రీ బాలాజీ సమీక్షించారు. ఈ తీరప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, లైఫ్గార్డులు, నిఘాతో సహా భద్రతా చర్యలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇక చీరాలలో కొత్తగా ప్రవేశపెట్టిన వాటర్ గేమ్స్ కేవలం సముద్రతీర సందర్శనలా కాకుండా.. పర్యాటకులు మరింత లీనమయ్యే బీచ్ అనుభవాన్ని అందించేలా రూపొందించారు. సందర్శకులను ఆకర్షించే అంశాలతో పాటు భద్రతా ఏర్పాట్లపై కూడా అధికారులు పనిచేస్తున్నారు. సందర్శకుల భద్రత, పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


