...
...
Next Story

ఏపీలో విభిన్న వాతావరణం - ఒకవైపు వర్షాలు, మరోవైపు భానుడి భగభగలు

AP Weather Updates : రాష్ట్రంలో ఒకే సమయంలో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల తీవ్రమైన ఎండలతో కూడిన విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.ఏ

Published on: Jun 02, 2026 06:33 AM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా, మరోవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ మేరకు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఒక ప్రకటనలో పేర్కొంది.

ఏపీలో విభిన్న వాతావరణం (image source @APSDMA)
ఏపీలో విభిన్న వాతావరణం (image source @APSDMA)

ఇవాళ (జూన్ 2, మంగళవారం) కూడా రాష్ట్రంలో వర్షాలతో పాటుగా కొన్నిచోట్ల ఎండ ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది. వాటి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఎండ తీవ్రత అధికంగా ఉండే జిల్లాలు:

మంగళవారం(జూన్ 2) నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

  • 42 నుంచి 44 డిగ్రీల వరకు: ఇవాళ పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42°C నుండి 44°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది.
  • 40 నుంచి 42 డిగ్రీల వరకు: పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C నుండి 42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

గూడూరులో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత

రాష్ట్రంలో ఎండల తీవ్రత నేడు కూడా భారీగానే కొనసాగింది. సోమవారం (జూన్ 1) నాడు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయ్యింది. అలాగే మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe