ఈ జిల్లాలో 60 ఖాళీలకు వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్.. డిసెంబర్ 31 లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్!
వైద్యారోగ్యశాఖలో పని చేయాలి అనుకునేవారికి గుడ్న్యూస్. ఏపీ వైద్యారోగ్య శాఖ 60 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ వైద్యారోగ్య శాఖ పలు ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అయితే ఈ ఖాళీలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. యూపీహెచ్సీ, పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. దరఖాస్తు చేసేందుకు డిసెంబరు 31ని చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 22వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

కృష్ణ జిల్లాలోని ఆరోగ్య సంస్థల్లోని వివిధ పోస్టులకు కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా నోటిఫికేషన్ వెలువడింది.
పోస్టుల వివరాలు
గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు-12
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ-16
శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు 10
ఈ నోటిఫికేషన్లో మెుత్తం 38 పోస్టులు ఉన్నాయి. మహిళా నర్సింగ్, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులకు SSC లేదా దాని తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ల్యాబ్-టెక్నీషియన్ Gr-IIకి కూడా ప్రభుత్వం గుర్తించిన ఎస్ఎస్సీ లేదా దాని తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. గుర్తింపు పొందిన సంస్థ/A.P. విశ్వవిద్యాలయం నుండి MLT లేదా B.Sc(MLTలో డిప్లొమా కలిగి ఉండాలి. లేదంటే MLTతో ఇంటర్మీడియట్ వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్/క్లినికల్ శిక్షణ కావాలి. తప్పనిసరిగా ఏపీపీఎంబీలో నమోదు అయి ఉండాలి. అభ్యర్థికి డి.ఎం.ఎల్.టి, బి.ఎస్సీ ఎం.ఎల్.టి రెండూ ఉన్నట్లయితే, పై వాటిలో దేనిలో అత్యధిక శాతం మార్కులు సాధించారో దానిని పరిగణనలోకి తీసుకుంటారు.
వయసు 42 సంవత్సరాలకు మించి ఉండకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఓసీ, బీసీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు 300 అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఈ లింక్ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ చదవండి
మరో నోటిఫికేషన్
యూపీహెచ్సీల్లో గ్రేడ్-2 ఫార్మసిస్ట్ పోస్టు 1
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 10
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12
ఫార్మసిస్ట్ పోస్టుకు గుర్తింపు పొందిన సంస్థ/A.P విశ్వవిద్యాలయం నుండి ఫార్మసీలో డిప్లొమా / B.Pharmacy ఉత్తీర్ణులై ఉండాలి. AP ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు, ఫార్మసీ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి.
ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుండి MLTలో డిప్లొమా లేదా విశ్వవిద్యాలయం నుండి B.Sc (MLT) లేదా MLT తో ఇంటర్మీడియట్ వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్/క్లినికల్ శిక్షణ కలిగి ఉండాలి. APPMB లో నమోదు చేసుకోవాలి. అభ్యర్థి DMLT, B, ScMLT రెండింటినీ కలిగి ఉంటే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందిన గరిష్ట శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
డేటా ఎంట్రీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలితో గుర్తింపు పొందిన సంస్థ నుండి పి.జి. డి.సి.ఎ. కలిగి ఉండాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులకు పదో తరగతి పాస్ అయి ఉండాలి.
నోటిఫికేషన్ వివరాలను https:///krishna.ap.gov.in వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్లో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


