...
...
Next Story

APPSC : పలు పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఏపీపీఎస్‌సీ

APPSC : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. పలు పోస్టులకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలనకు తేదీ ప్రకటించింది.

Published on: Jul 18, 2026 07:40 AM IST
Advertisement

హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలనను జూలై 20న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ

ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన వెంటనే, అదే రోజు అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(CPT) కూడా నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

మరోవైపు టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) పోస్టుల భర్తీకి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 23న ఉదయం 10 గంటలకు కమిషన్ కార్యాలయంలో జరగనుంది.

దీంతో పాటు ఏపీ సైనిక సంక్షేమ సర్వీసులో జిల్లా సైనిక సంక్షేమ అధికారి పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వేగవంతమైంది. 2026 జనవరి 27, 30 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షల ఆధారంగా, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. వీరికి కూడా జూలై 20న ఉదయం 10 గంటలకు కమిషన్ కార్యాలయంలో వెరిఫికేషన్ ఉంటుంది.

వివిధ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ (జనరల్/లిమిటెడ్ రిక్రూట్‌మెంట్) కింద అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులకు, అలాగే ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ (ఎకనామిక్స్) పోస్టులకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను కూడా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం, అప్‌డేట్ల కోసం కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe